One Man Two Jobs: ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు.. రెండుగా చీలిపోయిన టెక్ కంపెనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Man Two Jobs: ఒక ఉద్యోగి రెండు సంస్థల్లో పనిచేయటం సరికాదని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ పేర్కొన్నారు. అది మోసంతో సమానమని అభిప్రాయపడ్డారు. మూన్లైటింగ్గా పేర్కొనే ఈ పథకానికి ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విప్రో చైర్మన్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ విషయంలో సంప్రదాయ టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్లు రెండుగా చీలిపోయాయనటానికి ఇదో నిదర్శనమని చెప్పొచ్చు.
మరిన్ని ఐకియా స్టోర్లు
Also Read
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
స్వదేశీ ఫర్నీచర్ రిటైలర్ ఐకియా.. మెగా ఫార్మాట్ స్టోర్లతోపాటు స్మాల్ సిటీ ఔట్లెట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈ స్మాల్ సిటీ ఔట్లెట్లకు అనుబంధంగా ఆన్లైన్ చానల్ని కూడా అందుబాటులోకి తేనుంది. వినియోగదారుల అవసరాలకు, ఆలోచనలకు అనుగుణంగా తన వ్యాపార వ్యూహాలను మార్చుకుంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐకియాకి ప్రస్తుతం 10 స్టోర్లు ఉండగా మరో 15 స్టోర్లను ఓపెన్ చేయాలని చూస్తోంది.
KTR On Bandi Sanjay: అమిత్ షాకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ?
టాప్లో రష్యా
చైనాకు చమురును సరఫరా చేసే దేశాల్లో వరుసగా 3వ నెలలోనూ రష్యా టాప్లో నిలిచింది. ఈ విషయాన్ని చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ విడుదల చేసిన జులై నెల డేటా వెల్లడిస్తున్నట్లు మీడియా పేర్కొంది. రష్యా నుంచి తక్కువ రేటుకే చమురు లభిస్తుండటంతోపాటు చైనా తన పోటీ దేశాలైన అంగోలా, బ్రెజిల్ నుంచి షిప్మెంట్లను తగ్గించుకోవటం దీనికి ప్రధాన కారణాలని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీబీడీసీకి మార్గం
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని దశలవారీగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. సీబీడీసీని ముందుగా హోల్సేల్ బిజినెస్లలోనే వినియోగించేందుకు అనుమతించనుంది. కేవైసీ ఇవ్వని కస్టమర్లు ఈ నగదును వాడుకోకుండా ఉండేందుకు దీనికి పక్కాగా డిజైన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
భారీ నష్టం
గత వారం జరిగిన మార్కెట్ వ్యాల్యుయేషన్లో టాప్-10లోని 5 కంపెనీలు 30 వేల కోట్ల రూపాయలకు పైగా క్యాపిటలైజేషన్ను కోల్పోయాయి. ఈ 5 సంస్థల్లో ముఖ్యంగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా నష్టపోయింది. ఈ జాబితాలో రిలయెన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీలు ఉన్నాయి.
‘హువాయ్’ క్లోజ్
చైనాకు చెందిన దిగ్గజ టెలికం సంస్థ హువాయ్.. ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను తగ్గించనుంది. బెంగళూరులోని ఆర్ అండ్ డీ క్యాంపస్ను మూసివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్కం ట్యాక్స్ దాడులు, 5జీ స్పెక్ట్రం వేలం నుంచి మినహాయించటం, రీసెర్చ్ కొలాబరేషన్లపై ఆంక్షలు పెరగటం తదితర కారణాలతో హువాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!