Dhanteras Gold Sale: వామ్మో.. ఒక్కరోజులోనే రూ.60వేల కోట్ల విలువైన బంగారం కొనుగోళ్లు!
- దీపావళి సందర్భంగా మార్కెట్లో షాపింగ్ జోరు
- ధన్తేరస్ రోజున దేశవ్యాప్తంగా రూ.60వేల కోట్లు
- ఒక్క రోజులోనే రూ.20వేల కోట్లు బంగారం విక్రయం
- ఈ సిజన్లో రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా మార్కెట్లో షాపింగ్ జోరందుకుంది. నిన్ననే ధన్తేరస్ పండుగ గడిచిపోయింది. ధన్తేరస్ రోజున ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో అర్ధరాత్రి వరకు దుకాణాలు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లలో సుమారు రూ.60 వేల కోట్ల టర్నోవర్ జరిగింది. ఈ మొత్తం పండగల సీజన్లో దాదాపు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. అయితే.. ఈఏడాది.. దీపావళిలోనే చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
ధన్తేరస్పై రూ.60,000 కోట్ల వస్తువుల విక్రయం..
ఈ ఏడాది ధన్తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వస్తువులకు సంబంధించి దాదాపు రూ.60 వేల కోట్ల వ్యాపారం జరిగిందని అంటున్నారు. మంచి విషయం ఏమిటంటే, ఈ దీపావళికి “వోకల్ ఫర్ లోకల్” అనే ఫిలాసఫీ మార్కెట్లలో కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కొనుగోళ్లన్నీ దాదాపు భారతీయ వస్తువులే. దీపావళికి సంబంధించి చైనా వస్తువులను విక్రయించకపోవడం వల్ల దాదాపు రూ.1 లక్షా 25 వేల కోట్ల వ్యాపారంలో చైనా నష్టపోతోందని ఓ అంచనా.
Also Read
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
రూ. 20 వేల కోట్ల విలువైన బంగారం..
ఓ జాతీయ మీడియా అంచనాల ప్రకారం.. ఈ ధన్తేరస్లో దేశవ్యాప్తంగా సుమారు రూ. 20,000 కోట్ల విలువైన బంగారం, రూ. 2,500 కోట్ల విలువైన వెండి కొనుగోలు చేయబడింది. ఈ ఏడాది ధన్తేరస్లో బంగారం, వెండి విక్రయాలు పెరిగాయి. దేశంలో దాదాపు నాలుగు లక్షల మంది చిన్నా పెద్దా నగల వ్యాపారులు పనిచేస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో నమోదైన దాదాపు 2 లక్షల మంది నగల వ్యాపారులు నిన్న 25 టన్నుల బంగారాన్ని విక్రయించారు. దీని విలువ రూ.20 వేల కోట్లు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 250 టన్నుల వెండి విక్రయాలు జరగగా, దీని విలువ సుమారు రూ.2,500 కోట్లు.
ఒక్క ఏడాదిలోనే భారీగా పెరిగిన ధరలు..
గతేడాది ధన్తేరస్ సందర్భంగా 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలు పలికింది. ఈ ఏడాది రూ.81,211కి పెరిగింది. అదేవిధంగా గతేడాది వెండి ధర కిలో రూ.70 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.లక్షకు చేరుకుంది. అందువల్ల, బరువులో అమ్మకాలు క్షీణించినప్పటికీ, కరెన్సీ పరంగా అమ్మకాలు పెరిగాయి.
హస్తకళాకారులు మంచి ప్రోత్సాహం..
ఈ ఏడాది మట్టి దీపాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. స్థానిక స్థాయిలో రూ.10కి 12 మట్టి దీపాలు, రూ.20కి 25 మట్టి దీపాలు చిల్లరగా లభిస్తున్నాయి. ఒక పెద్ద దీపం 10 రూపాయలకు లభిస్తుంది. అయితే దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో మట్టి దీపాలు, బొమ్మలు, అలంకరణ వస్తువులు వంటివి కొనుగోలు చేస్తారు. దీంతో కుమ్మరులు, ఇతర కళాకారుల ఆదాయం పెరుగుతుంది. దీంతో వారి ఇళ్లలో కూడా దీపావళి జరిపిన వాళ్లమవుతున్నాము.
.
తాజావార్తలు
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!