ఎల్ఐసీ బంపరాఫర్.. వారికి 10 శాతం డిస్కౌట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే పాత పాలసీలను రెన్యువల్ చేసుకునే సౌలభ్యాన్ని కల్సించి గుడ్న్యూస్ చెప్పిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. ఇప్పుడు మరో గుడ్న్యూస్ చెప్పింది.. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ.. త్వరలో ఐపీవోకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ ఐపీవోలో పాల్గొనే పాలసీదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.. ఐపీవోలో 10 శాతం డిస్కౌంట్ పాలసీ దారులకు ఇవ్వనున్నట్టు పేర్కొంది.. అయితే, ఎల్ఐసీ యొక్క ప్రారంభ పబ్లిక్ ఆఫర్లో షేర్లను కొనుగోలు చేయడానికి ఈ తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది.. ప్రభుత్వం ఈ వారంలో ఆఫర్ పత్రాన్ని దాఖలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని వెల్లడించారు ఓ అధికారి.
Read Also: విశాఖ ఉక్కు లాగే… సింగరేణిపై కుట్ర.. తెలంగాణ ప్రగతిని దెబ్బ కొట్టే ప్రయత్నం..!
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
ఇక, ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) లేదా ఆఫర్ డాక్యుమెంట్ను ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నందున, ఎల్ఐసీ రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దాని మిలియన్ల కొద్దీ పాలసీదారులకు తగ్గింపుతో రావచ్చునని అధికారులు చెబుతున్నారు.. రిటైల్ విండో కింద పాలసీదారులకు నిర్దిష్ట రిజర్వేషన్ను కేటాయిస్తున్నామని తెలిపారు.. ఎల్ఐసీ చట్టం ప్రకారం 10 శాతం వరకు ఇష్యూని పాలసీదారులకు పోటీ ప్రాతిపదికన కొంత తగ్గింపుతో అందించవచ్చని అందుకు కావల్సిన నిబంధనలు రూపొందించినట్లు వెల్లడించారు.. కేవలం పాలసీదారులకే కాకుండా సంస్ధ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్ కల్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఎల్ఐసీ ప్రతిపాదిత ఐపీవోలో సామాన్యులను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. దీంతో ఐపీవోలో 5 శాతం నుంచి 10 శాతం మధ్య వారికి కేటాయింపు వుండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, విక్రయించనున్న షేర్ల శాతాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ యొక్క పాక్షిక ఉపసంహరణ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తగ్గించిన రూ.78,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు.. దీని మునుపటి లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లుగా ఉంది.. అయితే, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు మరియు వాస్తవ రసీదుల అంచనాలు వివిధ కారణాల వల్ల భిన్నంగా ఉండవచ్చు.. ఇక, ఎల్ఐసీ యొక్క ఐసీవో పరిమాణంతో పరస్పర సంబంధం కలిగి ఉండకూడదు, ఇక, ఐపీవో సమయంలో పాలసీదారులు షేర్లను కొనుగోలు చేయడానికి నిర్దిష్ట అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి, ఇది త్వరలో ప్రకటించబడుతుందని ఓ అధికారి తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!