NTV Telugu Site icon

Jio Bharat 4G: రూ. 699కే జియో 4G ఫోన్..

Jio Bharat 4g

Jio Bharat 4g

దీపావళి ధమాకా ఆఫర్ తో ముందుకొచ్చింది. 4G నెట్వర్క్ యాక్సిస్ చేయగల జియో భారత్ కీప్యాడ్ ఫోన్ భారీ తగ్గింపుతో మార్కెట్ లో విడుదలైంది. రూ.999 ధర కలిగిన ఈ కీప్యాడ్ ఫోన్ ఇప్పుడు రూ.699 కే విక్రయిస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఫోన్ కొన్న వారికి మరిన్ని ఆఫర్లు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ డిజిటల్ సేవలు పొందాలని, తమ ప్రియమైన వారితో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండేందుకు ఈ ప్రత్యేక దీపావళి ఆఫర్ ఇస్తున్నట్లు జియో ప్రతినిధులు తెలిపారు.

READ MORE: DGP Daughter Marriage: డీజీపీ కుమార్తె వివాహం.. వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు

జియో సిమ్ కార్డుతో మాత్రమే వర్క్ చేసే ఈ ఫోన్లను జియో మార్ట్, రిలయన్స్ స్టోర్, అమెజాన్ వెబ్‌సైట్ లో కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఇతర నెట్ వర్క్ రీఛార్జిలతో పోలిస్తే ఈ మొబైల్ లో ప్లాన్లు తక్కువ రేట్ కు లభిస్తాయని తెలిపింది. కేవలం రూ. 123 నెలవారీ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ చేయొచ్చు.14 జీబీ డేటాతో పాటు 455 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు మీరు లైవ్ చూడొచ్చు. ఇవే కాకుండా సినిమా ప్రీమియర్లు, తాజా సినిమాలు కూడా మీరు జియో భారత్ ఫోన్ ఉపయోగించి చూడొచ్చు. కాగా జియో భారత్ ఫోన్లను ఇండియాలో సుమారు 25 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా జియో ఫోన్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. అలాగే యూపీఐ, జియో సినిమా, జియో టీవీ వంటి పలు అద్భుత ఫీచర్లు ఉన్నాయి.

READ MORE:Mahesh Kumar Goud : కేటీఆర్‌తో ఉన్నవారు మాతో టచ్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయి