Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
- మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర
- వరుసగా నాల్గో రోజు భారీ నష్టాల్లో సూచీలు
- అంతర్జాతీయ పరిణామాలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాల్గో రోజు సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగినా లాభాల్లోనే దూసుకెళ్లింది. అనంతరం ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగించారు. అంతర్జాతీయంగా పరిస్థితులు బాగుంటాయని అంతా భావించారు. కానీ శాంతి ఒప్పందంపై క్లారిటీ రాకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. చమురు ధరల పెరుగుదల, ఐటీ రంగంలో బలహీన సంకేతాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 719 పాయింట్లు నష్టపోయి 76, 944 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 192 పాయింట్లు నష్టపోయి 23, 980 దగ్గర కొనసాగుతోంది. పెట్టుబడిదారులు అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్థిరత కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ వంటి స్టాక్స్ వెనుకబడ్డాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ను 2 శాతానికి పైగా కిందకు లాగాయి.
Also Read
- Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
- SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
తాజావార్తలు
-
Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
-
Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
-
Kakarla Krishna : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
-
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
-
Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!