పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు రోజుకోలాగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధ సమయంలో తగ్గిన ధరలు.. కాల్పుల విరమణ తర్వాత మళ్లీ పైపైకి వెళ్తున్నాయి. ఇక శుక్రవారం తగ్గిన ధరలు.. ఈరోజు మళ్లీ షాకిచ్చాయి. ఈరోజు తులం గోల్డ్పై రూ.330 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగాయి. దీంతో సామాన్యులు మళ్లీ షాక్కు గురయ్యారు.
తులం గోల్డ్పై రూ.330 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.300 పెరగడంతో రూ.1,38,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 పెరగడంతో రూ.1,13,200 దగ్గర ట్రేడ్ అవుతోంది.
వామ్మో.. సిల్వర్ ధర షాకిచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,65, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,70,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,65, 000 దగ్గర అమ్ముడవుతోంది.
