పశ్చిమాసియా కాల్పుల విరమణ ఒప్పందం వేళ మగువలకు భారీ షాక్ తగిలింది. మధ్యప్రాచ్యం యుద్ధం జరిగినంత కాలం పసిడి ధరలు దిగొచ్చాయి. తాజాగా ఇరాన్తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కానీ బంగారం, వెండి ధరలు మాత్రం హడలెత్తిస్తున్నాయి. అసలే ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్యులు లబోదిబో అంటున్నారు. ఈరోజు ఏకంగా తులం గోల్డ్పై రూ.3,980 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది.
తులం గోల్డ్పై రూ.3,980 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,53,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.3,650 పెరగడంతో రూ.1,41,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,990 పెరగడంతో రూ.1,15,370 దగ్గర ట్రేడ్ అవుతోంది.
బాబోయ్.. సిల్వర్ ధర బెంబేలెత్తిస్తోంది. ఈరోజు కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,65,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర అమ్ముడవుతోంది.
