Site icon NTV Telugu

Gold Price Today : బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Goldpricetoday

Goldpricetoday

పసిడి ప్రియులకు భారీ షాక్..గత రెండు మూడు రోజులుగా పసిడి ధర మార్కెట్ లో పరుగులు పెడుతుంది.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 58,000కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 230 వరకు పెరిగింది.. పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది.. వెండి కిలో పై రూ. 300 పెరిగి రూ. 81,000 చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,230గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.. అదే విధంగా చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,600గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,550గా ఉంది.. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,230గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి..

వెండి విషయానికొస్తే.. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా భారీగా పెరిగింది.. ఈరోజు వెండి ధర రూ. 300 పెరిగి 79,500కి చేరింది..హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 81,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 79,500.. బెంగళూరులో రూ. 76,750గా ఉంది… మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Exit mobile version