ప్రపంచ వ్యాప్తంగా పసిడికి మంచి డిమాండ్ ఉంది.. అయితే బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఒక్కోరోజు ఒక్కోలా ఉంటాయి.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో పరుగులు పెడుతుంది.. తాజాగా, బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 లు ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,670 గా ఉంది. తాజాగా బంగారంపై రూ.220 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.500 మేర పెరిగి రూ.74,000 లుగా కొనసాగుతోంది. దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,820 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000గా ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670 నమోదు అయ్యింది..
*. కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670 కొనసాగుతుంది..
*. అదే విధంగా హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,670గా ఉంది.
ఇక వెండి ధర విషయానికొస్తే.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,000 ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,000, చెన్నైలో రూ.77,500, బెంగళూరులో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది. కేరళలో రూ.77,500, కోల్కతాలో రూ.77,500 ఉంది. హైదరాబాద్లో వెండి ధర రూ.77,500 నమోదు అయ్యింది..