పసిడి ప్రియులకు ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్నటి రోజు బంగారం, వెండి ధరలు బాగానే తగ్గాయి. హమ్మయ్య.. ఫర్వాలేదు తగ్గాయని మురిసిపోయేలోపే.. గంటల వ్యవధిలోనే ధరలు మళ్లీ షాకిచ్చాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో సామాన్యులకు ఝలక్ ఇచ్చాయి. ఈరోజు తులం గోల్డ్పై రూ.1,960 పెరగగా.. వెండి మాత్రం ఉపశమనం కలిగించింది.
తులం గోల్డ్పై రూ.1,960 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,800 పెరగడంతో రూ.1,38,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,470 పెరగడంతో రూ.1,13,200 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
హమ్మయ్య.. సిల్వర్ ధర ఉపశమనం కలిగించింది. ధరలో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,50, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,55,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,50, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్పై రూ.137, డీజిల్పై రూ.184 పెంపు