Site icon NTV Telugu

Gold Price: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధర

Gold

Gold

పసిడి ప్రేమికులకు శుభవార్త.. మరోసారి బంగారం ధరలు కిందకు దిగివచ్చాయి.. తెలుగు రాష్ట్రాల్లో పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.. ఇవాళ హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌తో పాటు విజయవాడలోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి.. రూ.52,000కి దిగివచ్చింది. ఇదే సమయంలో.. వెండి ధర రూ.250 తగడ్డంతో కిలో వెండి ధర రూ.61,550కి చేరింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది.. స్పాట్​ గోల్డ్​ ధర 1,814 డాలర్లకు చేరింది.. ఇక, స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.14 డాలర్లుగా పలుకుతోంది..

Read Also: Rahul Gandhi: మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్.. కాంగ్రెస్ ఆందోళనలు ఉద్ధృతం

Exit mobile version