Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Price Hike: దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుక్రవారం లీటరుకు సుమారు రూ. 3.39 వరకు పెంచాయి. అయితే, ఇదే చివరి పెంపు కాదని, ముడిచమురు సంక్షోభం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో లేదా నెలల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఇంధన ధరల పెంపు ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి. మన దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు వంటి నిత్యావసర వస్తువులన్నీ లారీలు, వ్యాన్ల ద్వారానే రవాణా అవుతాయి. రవాణా భారం పెరగడంతో సహజంగానే ఆ ప్రభావం వస్తువుల ధరలపై పడుతుంది. ఇప్పటికే అమూల్, మదర్ డెయిరీ సంస్థలు పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచగా, దానికి ప్రధాన కారణం రవాణా ఖర్చులేనని పేర్కొన్నాయి. ఇది అంతిమంగా సామాన్యుడి వంటగది బడ్జెట్ను అస్తవ్యస్తం చేస్తుంది.
పెట్రోల్ ధరల పెంపుతో సొంత వాహనాలు వాడేవారికి నెలవారీ ఖర్చులు పెరుగుతాయి. మరోవైపు డీజిల్ ధరల వల్ల బస్సు ఛార్జీలు, క్యాబ్, ఆటో ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కేవలం ప్రయాణమే కాదు, మనకు అలవాటైన స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల డెలివరీ చార్జీలు సైతం పెరగవచ్చు. కంపెనీలు తమపై పడే అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి డిస్కౌంట్లను తగ్గించడం లేదా డెలివరీ ఫీజులను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇంధన ధరల సెగ నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తగిలే ప్రమాదం ఉంది. రైతులు సాగు కోసం వాడే ట్రాక్టర్లు, నీటి పంపులు పూర్తిగా డీజిల్పైనే ఆధారపడి ఉంటాయి. డీజిల్ ధర పెరిగితే వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరిగి, రైతులకు లాభాలు తగ్గడమే కాకుండా ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. పెరుగుతున్న ముడిచమురు ధరల దృష్ట్యా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. చమురు సరఫరా ఖరీదైనదిగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, ధరల పెరుగుదల అనివార్యమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం అంటే కేవలం వాహనాలకే కాదు, నిత్యావసరాల నుంచి విలాసాల వరకు ప్రతి అంశంపై భారం పడుతుంది.
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..