SmilePay: మీ ముఖ గుర్తింపుతో పేమెంట్.. స్మైల్పే స్టార్ట్ చేసిన ఫెడరల్ బ్యాంక్
- డిజిటల్ చెల్లింపుల్లో పుట్టుకొస్తున్న కొత్త పద్ధతులు..
- ఫేర్తింపు ఆధారంగా చెల్లింపులు చేసే అవకాశం..
- స్మైల్ పే తరహా పేమెంట్ విధానానికి శ్రీకారం చుట్టిన ఫెడరల్ బ్యాంక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SmilePay: డిజిటల్ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు సరి కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేసేది.. కానీ, ఆ తర్వాత యూపీఐ లైట్ అంటూ పిన్తో పని లేకుండా పోయింది. కొత్తగా ట్యాప్ అండ్ పే అంటూ గ్యాడ్జెట్స్తో పేమెంట్ చేసే ఛాన్స్ కొన్ని సంస్థలు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏకంగా వస్తువులతో పని లేకుండా కేవలం ఫేస్ గుర్తింపు ఆధారంగా పేమెంట్ చేసే సదుపాయం వచ్చేస్తోంది. ఇకపై పేమెంట్స్ చేయాలంటే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు అన్నమాట.
Also Read
- Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
- EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
- MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్తో సరికొత్త విప్లవం!
- RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
ఇక, స్మైల్ పే అనే పేరుతో కొత్త తరహా పేమెంట్ విధానానికి ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టింది. దీంతో వినియోగదారుల ఫేస్ రికగ్నైజేషన్తో ద్వారా చెల్లింపులు చేయొచ్చు. అంటే స్మార్ట్ఫోన్, గ్యాడ్జెట్స్తో పనుండదు. కేవలం రెండు దశల్లోనే ఈ చెల్లింపులు పూర్తి చేయొచ్చు. యూఐడీఏఐకి చెందిన భీమ్ ఆధార్ పేతో రూపొందించిన అధునాతన ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీనే ఈ స్మైల్ పే..బ్యాంక్ మర్చంట్స్ తమ మొబైల్లో ఫెడ్ మర్చెంట్ అప్లికేషన్లోని పేమెంట్ ఆప్షన్లలో ఉండే స్మైల్ పే ఆప్షన్ను ఎంచుకొని ఈ సేవలు పొందొచ్చు. ఫెడ్ మర్చంట్లు కస్టమర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. ఆ తర్వాత మర్చంట్ మొబైల్ నుంచి కస్టమర్ ఫేస్ ను స్కాన్ చేస్తారు.. ఉడాయ్ లోని ఫేషియల్ డేటా ఆధారంగా బ్యాంక్ దాన్ని ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది. వెరిఫై అయిన తర్వాత చెల్లింపులు పూర్తైనట్లు ఒక వాయిస్ అలర్ట్ వస్తుంది.. దీంతో పేమెంట్ గురించి వ్యాపారికి అప్డేట్ ఇస్తుంది.
Read Also: Nandamuri Balakrishnal: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అందరికీ ఆహ్వానం
అలాగే, ఒక్కో లావాదేవీకి రూ5,000 వరకు పరిమితి విధించింది. నెలకు కేవలం రూ.50వేల వరకు చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. అయితే, మర్చంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉండాలి.. ఈ సేవలతో అనేక లాభాలు ఉన్నాయి. కార్డు, క్యాష్, మొబైల్, డివైజెస్లకు లావాదేవీలకు కోసం వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.. కౌంటర్ దగ్గర ఎక్కువ సేపు నిలబడాల్సిన పని లేదు.. ఇది ఉదయ్ ఫేస్ అథెంటికేషన్ సర్వీస్ కాబట్టి భద్రత గురించి బాధ పడాల్సిన అవసం కూడా లేదు అని ఫెడరల్ బ్యాంక్ సీడీఓ ఇంద్రనీల్ పండిత్ అన్నారు.
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!