Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ప్రధాన ఆధారం. అయితే.. ప్రస్తుత కాలంలో వస్తున్న వెయ్యి రూపాయల కనిష్ట పెన్షన్ ఏ మూలకూ సరిపోవడం లేదన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలో.. లక్షలాది మంది ఈపీఎస్-95 (EPS-95) పెన్షనర్లకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
రూ. 7,500లకు పెన్షన్ పెంపు..?
Also Read
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
- Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ మేరకు, కనిష్ట పెన్షన్ను ప్రస్తుతమున్న రూ. 1,000 నుంచి రూ. 7,500లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. కార్మిక సంఘాలు, పార్లమెంటరీ కమిటీ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో.. దీనిపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే జరిగితే సామాన్యులకు, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల రిటైర్డ్ ఉద్యోగులకు ఇది పెద్ద వరం కానుంది.
ముఖ్యమైన మార్పులు ఇవే..
ఈపీఎఫ్ఓ (EPFO) తన సేవలను మరింత సులభతరం చేస్తోంది. త్వరలో ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం ద్వారా కాగితపు పని తగ్గించి, వేగంగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రయోజనం ఎవరికి..?
పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది వృద్ధులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలుస్తుంది. కేవలం పెన్షన్ పెంచడమే కాకుండా, పీఎఫ్ నగదును సులభంగా పొందేలా చేస్తున్న మార్పులు రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచుతాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ ఈ వార్త కోట్లాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
తాజావార్తలు
-
Pakistan: భారత్పై పగతో పెంచిన పామే ఇప్పుడు పాకిస్థాన్ను మింగేస్తుంది! వారంలోనే 50 మంది పాక్ సైనికులు ఖతం..
-
God of War: అసలు కుమారస్వామి ఎక్కడ పుట్టాడు?
-
ICC Rankings: వరల్డ్ కప్ కొట్టింది ఆసీస్.. కానీ ర్యాంకింగ్స్ టాప్లో మెరిసింది ఇండియన్ ప్లేయర్..
-
Modi-Indonesia: భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు.. తీరనున్న జలసంధి కష్టాలు
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!