టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను మరో సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం అయ్యిందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించినా.. ఎక్కువ సంస్థలు మాత్రం పోటీ పడింది లేదు.. ఈ దశలో చివరి వరకు నిలిచింది మాత్రం టాటా గ్రూపే.. దీంతో.. టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా వెళ్లిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.. ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని అయినట్టువంటి టాటా గ్రూప్ చేతికి వెళ్లిందనేది ఆ కథనం సారాశం.. అయితే, ఆ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది..
టాటా గ్రూప్.. ఎయిరిండియాను తిరిగి సొంతం చేసుకుందన్న బ్లూమ్బర్గ్ కథనాన్ని తప్పుబట్టిన కేంద్రం.. ఆ వ్యవహారంలో వివరణ ఇచ్చింది.. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణలో ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించిందన్న వార్తల్లో వాస్తవం లేదని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.. ఎయిరిండియా ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వెల్లడిస్తామని తెలిపింది. కాగా, ఎయిరిండియా సంస్థ కోసం డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది.. బిడ్లు వేసేందుకు నలుగురు మాత్రమే ముందుకు రాగా.. అందులో టాటా గ్రూప్ మాత్రమే చివరి దశవరకూ వెళ్లింది.. మరోవైపు 2018లో ఎయిరిండియాను అమ్మడానికి చేసిన ప్రయత్నాలు కూడా ముందుకు సాగలేదు.. ఇక, ఎయిరిండియా డిఇన్వెస్ట్మెంట్ విషయంలో భారత ప్రభుత్వం ఆర్థిక బిడ్ల ఆమోదాన్ని సూచించే వార్తలు తప్పు అని ఇన్వెస్ట్మెంట్ మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది.
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
- UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..