Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byjus Story: ఇండియన్ ఎడ్టెక్ రంగంలో ఆకాశంలో ఒక తారగా వెలుగు వెలిగి, అపారమైన సంపదను సృష్టించిన బైజూ రవీంద్రన్ ప్రస్థానం ఇప్పుడు జైలు శిక్ష వరకు చేరుకుంది. ఒక సామాన్యుడి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 22 బిలియన్ డాలర్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించి, ఇప్పుడు కోర్టు ధిక్కరణ నేరం కింద సింగపూర్ న్యాయస్థానంలో ఆరు నెలల జైలు శిక్ష, దాదాపు 70,500 డాలర్ల (సుమారు రూ. 59 లక్షలకు పైగా) జరిమానా ఎదుర్కోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక సాధారణ టీచర్గా మొదలై అంతర్జాతీయ బిలియనీర్గా ఎదిగి, శిఖరాగ్రం నుంచి శూన్యానికి ఆయన ప్రస్థానం ఎలా సాగిందో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కేరళ పల్లెటూరు నుంచి ఐఐఎం టాపర్ వరకు..
బైజు రవీంద్రన్ 1980లో కేరళలోని కన్నూర్ జిల్లా, అళికోడ్ గ్రామంలో జన్మించారు. ఒక మలయాళ మాధ్యమ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో బి.టెక్ కంప్లీట్ చేశారు. తర్వాత వృత్తిరీత్యా షిప్పింగ్ కంపెనీలో ఇంజినీర్గా యూకేలో పనిచేసినప్పటికీ, బోధనపై ఉన్న మక్కువతో భారత్కు తిరిగి వచ్చారు. ఆశ్చర్యకరంగా ఐఐఎం ప్రవేశ పరీక్ష (CAT) రాసిన ప్రతిసారీ 100 పర్సంటైల్ సాధించి తన మేధస్సుతో అబ్బుర పరిచారు. అయితే ఐఐఎంలో చేరడం కంటే, విద్యార్థులకు పాఠాలు చెప్పడమే ఉత్తమం అని నిర్ణయం తీసుకొని, తన భార్య దివ్యా గోకుల్నాథ్తో కలిసి 2011లో ‘బైజూస్’ సంస్థకు పునాది వేశారు.
Also Read
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
శిఖరాగ్రం నుంచి శూన్యానికి..
2015లో స్టార్ట్ అయిన ‘బైజూస్ – ది లెర్నింగ్ యాప్’ విద్యా రంగంలో పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ విద్యకు ఆదరణ పెరగడంతో కంపెనీ విలువ 22 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.83 లక్షల కోట్లు) చేరింది. కానీ తర్వాత కాలంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో బైజూస్ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే నిధుల కొరత వేధించడం, ఖర్చులు పెరగడంతో కంపెనీని కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇదే సమయంలో ఫెమా ఉల్లంఘనల ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కూడా నిర్వహించింది. అలాగే 2023లో కంపెనీలో కీలక డైరెక్టర్లు రాజీనామా చేయడంతో మార్కెట్లో కంపెనీ విశ్వసనీయత దెబ్బతింది. 2022లో 60 వేల మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య, 2024 నాటికి కేవలం 14 వేలకు పడిపోయింది.
జైలు శిక్షకు దారితీసిన పరిస్థితులు
ఆస్తుల వెల్లడికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పదేపదే ధిక్కరించడమే రవీంద్రన్ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎంతో గౌరవం పొందిన ఈ ‘గ్లోబల్ టీచర్’, నేడు విదేశీ పెట్టుబడిదారుల ఫిర్యాదులు, న్యాయపరమైన చిక్కులతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యా రంగంలో విప్లవం తెచ్చిన ఒక సంస్థ ఇలా దివాలా అంచున నిలబడటం స్టార్టప్ ప్రపంచంలో ఒక పెద్ద గుణపాఠంగా మిగిలిపోయిందని అంటున్నారు.
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?