Air India Crisis: రూ.22 వేల కోట్ల నష్టంలో ఎయిర్ ఇండియా.. టాటా బాస్తో సింగపూర్ ఎయిర్లైన్స్ CEO రెస్క్యూ మీటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Crisis: భారత విమానయాన రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఎయిర్ ఇండియా, ప్రస్తుతం ఊహించని సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రూ.22,000 కోట్ల భారీ నష్టం, సీఈఓ రాజీనామా, ప్రయాణికుల్లో తగ్గిన నమ్మకం వంటి పరిణామాల మధ్య టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్తో సింగపూర్ ఎయిర్లైన్స్ సీఈఓ ‘గో చూన్ ఫోంగ్’ గురువారం బాంబే హౌస్లో భేటీ అయ్యారు. ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1% వాటా ఉన్న నేపథ్యంలో, సంస్థను గట్టెక్కించేందుకు ఒక భారీ ‘రెస్క్యూ ప్లాన్’కు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
READ ALSO: Rahul Gandhi: రాహుల్ గాంధీకు బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్..
Also Read
- EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
- US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
- Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
- Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
2026 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా ఏకంగా రూ.22,000 కోట్ల ($2.2 బిలియన్ డాలర్లు) రికార్డు నష్టాన్ని చవిచూసింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల గగనతలం మూసివేత, పాకిస్థాన్ మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటివి ఈ నష్టాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోటర్ల నుంచి భారీ పెట్టుబడులు వస్తేనే సంస్థ మనుగడ సాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అప్పుడే చెదిరిన నమ్మకం
జూన్ 12, 2025న అహ్మదాబాద్లో జరిగిన AI 171 (బోయింగ్ 787 డ్రీమ్లైనర్) ప్రమాదం ఎయిర్ ఇండియా ప్రతిష్టను మసకబార్చింది. 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటన తర్వాత ప్రయాణికులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఇది నేరుగా సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థ కష్టాల్లో ఉన్న సమయంలోనే సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ ఏప్రిల్ 7, 2026న తన పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు ఆయన కొనసాగుతున్నప్పటికీ, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అనిశ్చితి నెలకొంది. తాజా భేటీలో కొత్త సీఈఓ అన్వేషణ, సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి సాంకేతిక, నిర్వహణ మద్దతు తీసుకోవడంపై చర్చలు జరిగినట్లు సమాచారం. సింగపూర్ ఎయిర్లైన్స్తో జరిగిన ఈ చర్చల ద్వారా ఖర్చుల తగ్గింపు, సేవల మెరుగుదల, వ్యూహాత్మక మార్పులపై టాటా గ్రూప్ దృష్టి సారించనుందని సమాచారం. ఈ ‘రెస్క్యూ ప్లాన్ ‘ ఎయిర్ ఇండియాకు పునర్జీవం పోస్తుందో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..