APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APY Monthly Pension: రేపటి గురించి ఆలోచించని వారికి నేటి పొదుపే శ్రీరామరక్ష. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా, గౌరవప్రదంగా జీవించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో.. జీవితాంతం హామీతో కూడిన పెన్షన్ అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే అటల్ పెన్షన్ యోజన (APY) పథకం అసంఘటిత రంగ కార్మికులకు, సామాన్యులకు ఇది ఎలా వరంగా మారుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు ఏమిటి ఈ పథకం?
అటల్ పెన్షన్ యోజన పట్ల ప్రజల్లో అవగాహన, ఆదరణ ఈ రోజుల్లో పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 21, 2026 నాటికి దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. దేశంలో సామాజిక భద్రతను పెంచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు చేరవచ్చు. మీరు ఎంచుకున్న మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల వయస్సు తర్వాత ప్రతి నెలా రూ.1,000 – రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ డెబిట్ సౌకర్యం ఉండటం వల్ల చెల్లింపులు కూడా చాలా సులభం.
Also Read
- Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన 'షాపింగ్' కింగ్..
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- RBI New FD Rules: ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టే వారికి కీలక సమాచారం.. RBI కొత్త నిబంధనలతో ఏం మారుతుంది?
- OBHS Team Railway: రైళ్లలో కొత్త హౌస్కీపింగ్ బృందం.. ఇక జనరల్ కోచ్లలోనూ ఫస్ట్ క్లాస్ తరహా శుభ్రత..!
పెట్టుబడి ఎంతంటే..
నెలవారీ పెన్షన్ రూ.5,000 పొందాలనుకుంటే, మీరు చేరిన వయస్సును బట్టి పెట్టుబడి మారుతుంది. మీరు 18 ఏళ్లకే ప్రారంభిస్తే.. నెలకు కేవలం రూ.210 చెల్లిస్తే సరిపోతుంది. 30 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.577 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 40 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే నెలకు రూ.1,454 చెల్లించాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే.. ఎంత త్వరగా ప్రారంభిస్తే, నెలవారీ భారం అంత తక్కువగా ఉంటుంది. APY కేవలం మీకే కాదు, మీ కుటుంబానికి కూడా భరోసా ఇస్తుంది. పెన్షన్ దారుడు మరణిస్తే, అదే పింఛను మొత్తం జీవిత భాగస్వామికి (భార్య/భర్త) అందుతుంది. ఇద్దరూ మరణిస్తే దాదాపు రూ.8.5 లక్షల కార్పస్ నిధిని నామినీకి అందజేస్తారు. ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉన్న 18 నుంచి 40 సంవత్సరాల లోపు భారతీయులందరూ ఈ పథకంలో చేరవచ్చు.
తాజావార్తలు
-
India Fielding Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ మార్పు.. 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్కు కీలక బాధ్యతలు!
-
Ramayana: నితేష్ తివారీ సినిమా వెనుక మరో సీక్రెట్.. అస్సాం చరిత్రకు ‘రామాయణం’తో సంబంధం ఉందా?
-
Women’s Asia Cup 2026కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్గా స్మృతి మందాన..!
-
20 బంతుల్లో 5 వికెట్లు.. Rashid Khan మ్యాజిక్.. MI లండన్ విజయం..!
-
Delhi Police: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్పై కేసు విషయంలో.. ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!