APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APY Monthly Pension: రేపటి గురించి ఆలోచించని వారికి నేటి పొదుపే శ్రీరామరక్ష. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా, గౌరవప్రదంగా జీవించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో.. జీవితాంతం హామీతో కూడిన పెన్షన్ అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే అటల్ పెన్షన్ యోజన (APY) పథకం అసంఘటిత రంగ కార్మికులకు, సామాన్యులకు ఇది ఎలా వరంగా మారుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు ఏమిటి ఈ పథకం?
అటల్ పెన్షన్ యోజన పట్ల ప్రజల్లో అవగాహన, ఆదరణ ఈ రోజుల్లో పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 21, 2026 నాటికి దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. దేశంలో సామాజిక భద్రతను పెంచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు చేరవచ్చు. మీరు ఎంచుకున్న మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల వయస్సు తర్వాత ప్రతి నెలా రూ.1,000 – రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ డెబిట్ సౌకర్యం ఉండటం వల్ల చెల్లింపులు కూడా చాలా సులభం.
Also Read
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
పెట్టుబడి ఎంతంటే..
నెలవారీ పెన్షన్ రూ.5,000 పొందాలనుకుంటే, మీరు చేరిన వయస్సును బట్టి పెట్టుబడి మారుతుంది. మీరు 18 ఏళ్లకే ప్రారంభిస్తే.. నెలకు కేవలం రూ.210 చెల్లిస్తే సరిపోతుంది. 30 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.577 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 40 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే నెలకు రూ.1,454 చెల్లించాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే.. ఎంత త్వరగా ప్రారంభిస్తే, నెలవారీ భారం అంత తక్కువగా ఉంటుంది. APY కేవలం మీకే కాదు, మీ కుటుంబానికి కూడా భరోసా ఇస్తుంది. పెన్షన్ దారుడు మరణిస్తే, అదే పింఛను మొత్తం జీవిత భాగస్వామికి (భార్య/భర్త) అందుతుంది. ఇద్దరూ మరణిస్తే దాదాపు రూ.8.5 లక్షల కార్పస్ నిధిని నామినీకి అందజేస్తారు. ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉన్న 18 నుంచి 40 సంవత్సరాల లోపు భారతీయులందరూ ఈ పథకంలో చేరవచ్చు.
తాజావార్తలు
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..