Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీని ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడుతోంది. ఇటీవల దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్పై సుమారు 3 రూపాయలు పెంచినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థల నష్టాలు పూర్తిగా తగ్గలేదు. ధరల పెంపునకు ముందు రోజుకు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయిన చమురు కంపెనీలు, ప్రస్తుతం రోజుకు సుమారు రూ. 750 కోట్ల వరకు నష్టపోతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ వెల్లడించారు. ఈ భారీ నష్టాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (LPG) దిగుమతి ఖర్చులు కూడా ఉన్నాయని, అయితే ప్రస్తుతం చమురు సంస్థలకు ఎలాంటి ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు.
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ నివేదిక ప్రకారం.. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు ప్రారంభం కాకముందు, ఫిబ్రవరి నెలలో భారతీయ బాస్కెట్ ముడి చమురు ధర బ్యారెల్కు 69.01 డాలర్లుగా ఉండేది. కానీ గత 80 రోజులుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల మే 15 నాటికి ఈ ధర ఏకంగా 110.73 డాలర్లకు చేరింది. అంటే కేవలం మూడు నెలల వ్యవధిలోనే బ్యారెల్కు 41.72 డాలర్లు అదనంగా పెరిగింది.
Also Read
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
భారత్పై ప్రభావం..
భారతదేశం తన అవసరాలకు సరిపడా ముడి చమురులో 85 శాతానికి పైగా, ఎల్పీజీలో 60 శాతాన్ని అంతర్జాతీయ మార్కెట్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40 శాతం ముడి చమురు, 90 శాతం ఎల్పీజీ చారిత్రాత్మకంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ మార్గం గుండానే భారత్కు చేరుకుంటాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య రేగిన వివాదం వల్ల ఈ సముద్ర మార్గంలో సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల భారత్ చమురు దిగుమతుల కోసం పెట్టే మొత్తం ఖర్చు 60 శాతానికి పైగా పెరిగింది.
ప్రభుత్వ రంగ సంస్థలపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 27న పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 మేర తగ్గించింది. అయితే, వీటిపై వ్యాట్ (VAT), సేల్స్ టాక్స్ ద్వారా ఏటా లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పన్ను తగ్గింపు నిర్ణయాలు తీసుకోలేదు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!