Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani Ports: స్టాక్ మార్కెట్లో బుధవారం నాటి ట్రేడింగ్ అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. గ్రూప్లోని అత్యంత కీలకమైన షేర్ అదానీ పోర్ట్స్ (Adani Ports ) సరికొత్త రికార్డులతో సూపర్ పెర్ఫార్మెన్స్ చూపించింది. ట్రేడింగ్ సెషన్లో ఈ షేర్ ఏకంగా 2.76 శాతం లాభపడి, రూ.1,860.20 వద్ద తన 52 వారాల నూతన గరిష్ట స్థాయిని తాకింది. గత ఏడాది కాలంలో 28 శాతానికి పైగా పెరిగిన ఈ స్టాక్.. కేవలం గడిచిన 3 నెలల్లోనే ఇన్వెస్టర్లకు 42 శాతం బంపర్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ భారీ పెరుగుదల వెనుక ఒక సంచలన విదేశీ ఒప్పందం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ డీల్ ఏంటో తెలుసా..
రూ.13,225 కోట్ల విదేశీ డీల్..
ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ సంస్థల్లో ఒకటైన MSC (మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ) కి చెందిన కంటైనర్ టెర్మినల్ వింగ్ ‘TiL’ తో అదానీ పోర్ట్స్ ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, అదానీ విజింజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (AVPPL) లో TiL సంస్థ 49 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మెగా డీల్ విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.13,225 కోట్లు). ఈ పెట్టుబడి తర్వాత విజింజం పోర్ట్ మొత్తం ఎంటర్ప్రైజ్ విలువ 2.85 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. అయితే దీనికి ఇంకా కొన్ని రెగ్యులేటరీ అనుమతులు రావాల్సి ఉంది.
Also Read
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
పోర్ట్ సామర్థ్యం భారీగా పెంపు..
ఈ భాగస్వామ్యంతో కేరళంలోని విజింజం పోర్ట్ రూపురేఖలు మారనున్నాయి. అదానీ గ్రూప్ ఈ పోర్ట్ యొక్క కంటైనర్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 16 లక్షల TEU (కంటైనర్ కొలత) సామర్థ్యాన్ని, డిసెంబర్ 2028 నాటికి ఏకంగా 57 లక్షల TEUలకు పెంచనున్నారు. ఈ సామర్థ్య పెంపు వల్ల ప్రస్తుతం ఆగ్నేయాసియా పోర్టుల ద్వారా సాగుతున్న బంగ్లాదేశ్కు చెందిన భారీ ట్రాన్స్షిప్మెంట్ కార్గో ట్రాఫిక్ భవిష్యత్తులో విజింజం పోర్టుకు మళ్లే అవకాశం ఉంది. కాగా అదానీ పోర్ట్స్కు MSC సంస్థతో ముంద్రా, ఎన్నోర్ పోర్టులలో ఇప్పటికే విజయవంతమైన భాగస్వామ్యం ఉంది. విజింజం పోర్ట్ ప్రారంభమైన తొలి 18 నెలల్లోనే 20 lakhs TEU ల కంటైనర్లను హ్యాండిల్ చేసి రికార్డు సృష్టించగా, అందులో అత్యధిక వాటా MSC కార్గోదే కావడం విశేషం.
ఇన్వెస్టర్లకు బ్రోకరేజ్ సలహా..
ఈ భారీ అంతర్జాతీయ ఒప్పందం నేపథ్యంలో ప్రముఖ డొమెస్టిక్ బ్రోకరేజ్ హౌస్ ఎమ్కే (Emkay) అదానీ పోర్ట్స్ స్టాక్పై అత్యంత బుల్లిష్గా ఉంది. పోర్ట్ సామర్థ్యం పెరగడం, విదేశీ భాగస్వామ్యం వల్ల దీర్ఘకాలంలో కంపెనీకి తిరుగులేని వృద్ధి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నమ్మకంతోనే ఎమ్కే సంస్థ అదానీ పోర్ట్స్కు ‘BUY’ (కొనవచ్చు) రేటింగ్ను కొనసాగిస్తూ.. మార్చి 2027 నాటికి దీని టార్గెట్ ప్రైస్ను రూ.1,900 నుంచి నేరుగా రూ. 2,000 కు పెంచేసింది.
తాజావార్తలు
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!