NTV Telugu Site icon

Bigg Boss 8: బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఎవరంటే?

Bigg Boss 8 Telugu

Bigg Boss 8 Telugu

తెలుగు బిగ్​బాస్​ సీజన్​ 8 ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. గత వారం వైల్డ్​ కార్డు​ ఎంట్రీస్ తో ఆట స్వరూపం మారిపోయింది. అటు ఆటతో.. ఇటు ఎంటర్​టైన్​మెంట్​తో ప్రేక్షకులను అలరిస్తున్నారు కంటెస్టెంట్లు. ఇక ఈ వారం ఏకంగా వైల్డ్​ కార్డ్​ కంటెస్టెంట్​ మెహబూబ్​ మెగా చీఫ్​గా కూడా ఎన్నికవగా వైల్డ్ కార్డ్​ సభ్యులు​ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి ఎలిమినేషన్ కావడంతో ఆరో వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారనే విషయంలో ఆడియన్స్​లో కాస్త క్యూరియాసిటీ ఉంది. వైల్డ్ కార్డ్​ సభ్యులు ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి నామినేషన్లు కావడంతో కేవలం వైల్డ్ కార్డ్​​ సభ్యులు మాత్రమే ఓజీ క్లాన్​ సభ్యులలో ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్​ చేశారు. అలా మొత్తానికి ఆరో వారం నామినేషన్లలో యష్మీ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ ఉండగా.. వైల్డ్​ కార్డ్స్ ఎంట్రీలుగా వచ్చిన మెహబూబ్, గంగవ్వ కూడా నామినేట్​ అయ్యారు.

Chiranjeevi: చంద్రబాబు నివాసానికి చిరు.. ఎందుకంటే?

ఈ వారం నామినేషన్ల ప్రక్రియ రెండు రోజుల పాటు జరిగడంతో ఓటింగ్​ ప్రాసెస్​ మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యి శుక్రవారం రాత్రి ఎండ్​ అయ్యింది. ఇక అన్ అఫీషియల్​ ఓటింగ్ లెక్కలు చూస్తే గంగవ్వ టాప్​లో ఉన్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాతి స్థానంలో మెహబూబ్​, యష్మీ, విష్ణుప్రియ ఉన్నట్లు సమాచారం. ఇక ఐదు, ఆరు స్థానాల్లో పృథ్వీ, కిర్రాక్​ సీత ఉన్నారని అంటున్నారు. విష్ణుప్రియ, పృథ్వీ, సీత డేంజర్​ జోన్​లో ఉన్నారని ప్రచారం జరగగా ఇప్పుడు బిగ్ బాస్ లీక్స్ ప్రకారం సీత ఎలిమినేట్​ అయిందని అంటున్నారు. అయితే ఈ విషయం అఫీషియల్​గా తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే. అయితే సీత ఎలిమినేషన్​ ఓ రకంగా ఆడియన్స్​కు షాక్​ అని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి రెండు వారాల్లో అదరగొట్టి చీఫ్ అయిన సీత.. ఆ తర్వాత వారాల్లో చాలా డల్​ అయింది, ఆమెకు ఫాన్ ఫాలోయింగ్ పెద్దగా లేకపోవడంతో ఆమె బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.