బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. రేపు సాయంత్రం నుంచి గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరగనుంది.. మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోబోతోంది. డిసెంబర్ 17న ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఈ ఏడాది హౌస్లోకి వచ్చిన 19 మంది కంటెస్టెంట్స్లో శివాజీ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు… ఇక సోషల్ మీడియాలో గాసిప్ రాయుళ్లు కూడా రకరకాల వార్తలను రాస్తున్నారు..
ఇక తాజాగా ఓ ప్రోమోను బిగ్ బాస్ విడుదల చేసింది.. యాంకర్ శ్రీముఖి సందడి చేస్తూ కనిపించింది. బిగ్ బాస్ 7 సీజన్ పూర్తైన నెక్ట్స్ వీక్ ‘సూపర్ సింగర్’ కార్యక్రమం ఉంటుందని హౌస్లో శ్రీముఖి అనౌన్స్ చేసింది. కంటెస్టెంట్స్కి సరదాగా సింగింగ్ ఆడిషన్ పెట్టింది. ప్రశాంత్ని ఉద్దేశించి ‘ఇది ఫన్ టాస్క్.. ఓడిపోతే హగ్గిస్తా.. గెలిస్తే గట్టి హగ్గిస్తా.. ఓకే’ అనడంతో ప్రశాంత్ నవ్వుతూ మెలికలు తిరిగిపోయాడు.. అమర్ కొత్త పదాలతో పాటను పాడాడు.. ఆ తర్వాత ఒక్కొక్కరు పాట పాడారు..
ప్రశాంత్ మాత్రం కాస్త గట్టిగానే ట్రై చేశారు..శ్రీముఖి ట్రూత్ ఆర్ డేర్ ఆడించింది. ముగ్గురి నుంచి ఒకరితో డేట్, ఒకరిని కిల్, ఒకరిని మ్యారీ అంటే ఎలా సెలక్ట్ చేసుకుంటావ్? అని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు ప్రిన్స్ యావర్ అశ్వినిని పెళ్లి చేసుకుంటానని అందరికీ షాక్ ఇచ్చాడు… శ్రీముఖి ఎంట్రీతో హౌస్ మొత్తం సందడిగా సాగింది..ఫినాలేలో మాజీ కంటెస్టెంట్లు కూడా పార్టిసిపేట్ చేసి డ్యాన్సులతో అలరించబోతున్నట్లు సమాచారం. గ్రాండ్ ఫినాలేకి మహేష్ బాబు వస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఎవరు విన్నర్? ఎవరు రన్నర్ అనేది కొద్ది గంటల్లో తెలియనుంది..