Koti Deepotsavam 2024 Day 14: అంగరంగ వైభవంగా మధురై మీనాక్షీసుందరేశ్వరుల కల్యాణం..
- 14వ రోజు ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు
- దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్న భక్తులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులు ఈ నెలలో శివుడు, విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది. కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 14వ రోజు మార్మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులయ్యారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంతో సహా హాజరయ్యారు. అలాగే.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధురై మీనాక్షీసుందరేశ్వరుల కల్యాణం తిలకించారు.

Also Read
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
PM Modi: 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ
కార్తీక శుక్రవారం వేళ ఈరోజు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. పద్నాలుగో రోజు వేడుకల్లో… బృందావనం ఆనందధామం సద్గురు రితేశ్వర్ స్వామి ఆశీర్వచనం, బ్రహ్మ శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనం, శ్రీకృష్ణతత్త్వంపై డా.ఎల్వీ గంగాధరశాస్త్రి గాన ప్రవచనం అలరించాయి. ఆ తర్వాత.. జగన్మాత వైభవం, భక్తులచే కనకదుర్గమ్మకు కోటిగాజుల అర్చన మధురాతి మధురంగా చేశారు. అలాగే.. ఉడిపి శ్రీకృష్ణ నవనీతపూజ, మధురై మీనాక్షీసుందరేశ్వరుల కల్యాణం చూసి భక్తులు తిలకించి తరించిపోయారు. ఆదిదంపతులు నందివాహనంపై భక్తులను అనుగ్రహించారు. చివరలో లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనంతో 14వ రోజు కోటి దీపోత్సవం వైభవంగా ముగిసింది.
తాజావార్తలు
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..