Kartika Purnima: కార్తీక పౌర్ణమినాడు ఉసిరి దీపం ఎందుకు..? విశిష్టత ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartika Purnima: కార్తీక మాసం… శివపార్వతుల అనుగ్రహాన్ని అందించి.. ఆధ్యాత్మిక శక్తితో నింపే ఓ పవిత్రమైన నెల. ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు వంటి ఎన్నో ఆచారాలు ఉన్నప్పటికీ.. వీటన్నింటిలోనూ ఉసిరి వృక్షం, దాని ఫలం యొక్క పాత్ర అసాధారణమైనది. కేవలం పూజలకే కాదు.. మన ఆరోగ్యం, పర్యావరణానికి కూడా మేలు చేసే ఈ ఉసిరి ప్రాముఖ్యత కార్తీకంలో ఎందుకంత విశేషంగా ఉందో తెలుసుకుందాం.
Also Read
- Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Lunar Eclipse 2026: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. స్కంద పురాణం ప్రకారం సాక్షాత్తు ఉసిరి చెట్టులో శివపార్వతులతో పాటు బ్రహ్మ, సకల దేవతలు నివసిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి, సోమవారాలు, ఏకాదశి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన రోజుల్లో శివాలయాల్లో వెలిగించే 365 వత్తుల దీపారాధనతో పాటు ఉసిరి దీపం కూడా ప్రధానమైనదిగా భావిస్తారు.
ఉసిరి దీపారాధన వెనుక ఒక పురాణ కథ ఉంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు.. కార్తీక మాసంలో శివుడిని పూజించడానికి ఆలయం లేక ద్రౌపది బాధపడింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఉపదేశిస్తూ.. జూదంలో ఓడిపోయి కష్టాలు పడుతున్న పాండవులకు, గ్రహాల చెడు ఫలితాల నుంచి ఉపశమనం లభించడానికి కార్తీక మాసంలో ఉసిరి కాయ, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలని సూచించాడు. పద్మపురాణం ప్రకారం ఈ దీపారాధన నవగ్రహ దోషాలను పరిహరిస్తుంది.
ఇక కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చే మరో ముఖ్యమైన ఆచారం వనభోజనాలు. పురాణాలలో నైమిశారణ్యంలో మునులు, శ్రీకృష్ణుడు నందగోప బాలురతో కలిసి వనభోజనం చేసినట్లు వివరించబడింది. అర్చకుల ప్రకారం ఈ మాసంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం అత్యంత విశేష ఫలితాలను అందిస్తాయని తెలిపారు. హిందూ పురాణాలలో ఉసిరి చెట్టును ‘దాత్రి’ అని పిలుస్తారు, అంటే క్షమించే గుణానికి ప్రతీక. దీనిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వనంలో ఉసిరి చెట్టు కింద ధాత్రి కళ్యాణం (ఉసిరి కొమ్మను విష్ణువుగా, తులసి కొమ్మను లక్ష్మీదేవిగా భావించి చేసే కళ్యాణం) జరిపించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.
తాజావార్తలు
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!