Kartika Purnima: కార్తీక పౌర్ణమినాడు ఉసిరి దీపం ఎందుకు..? విశిష్టత ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartika Purnima: కార్తీక మాసం… శివపార్వతుల అనుగ్రహాన్ని అందించి.. ఆధ్యాత్మిక శక్తితో నింపే ఓ పవిత్రమైన నెల. ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు వంటి ఎన్నో ఆచారాలు ఉన్నప్పటికీ.. వీటన్నింటిలోనూ ఉసిరి వృక్షం, దాని ఫలం యొక్క పాత్ర అసాధారణమైనది. కేవలం పూజలకే కాదు.. మన ఆరోగ్యం, పర్యావరణానికి కూడా మేలు చేసే ఈ ఉసిరి ప్రాముఖ్యత కార్తీకంలో ఎందుకంత విశేషంగా ఉందో తెలుసుకుందాం.
Also Read
- Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
- Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
- Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. స్కంద పురాణం ప్రకారం సాక్షాత్తు ఉసిరి చెట్టులో శివపార్వతులతో పాటు బ్రహ్మ, సకల దేవతలు నివసిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి, సోమవారాలు, ఏకాదశి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన రోజుల్లో శివాలయాల్లో వెలిగించే 365 వత్తుల దీపారాధనతో పాటు ఉసిరి దీపం కూడా ప్రధానమైనదిగా భావిస్తారు.
ఉసిరి దీపారాధన వెనుక ఒక పురాణ కథ ఉంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు.. కార్తీక మాసంలో శివుడిని పూజించడానికి ఆలయం లేక ద్రౌపది బాధపడింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఉపదేశిస్తూ.. జూదంలో ఓడిపోయి కష్టాలు పడుతున్న పాండవులకు, గ్రహాల చెడు ఫలితాల నుంచి ఉపశమనం లభించడానికి కార్తీక మాసంలో ఉసిరి కాయ, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలని సూచించాడు. పద్మపురాణం ప్రకారం ఈ దీపారాధన నవగ్రహ దోషాలను పరిహరిస్తుంది.
ఇక కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చే మరో ముఖ్యమైన ఆచారం వనభోజనాలు. పురాణాలలో నైమిశారణ్యంలో మునులు, శ్రీకృష్ణుడు నందగోప బాలురతో కలిసి వనభోజనం చేసినట్లు వివరించబడింది. అర్చకుల ప్రకారం ఈ మాసంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం అత్యంత విశేష ఫలితాలను అందిస్తాయని తెలిపారు. హిందూ పురాణాలలో ఉసిరి చెట్టును ‘దాత్రి’ అని పిలుస్తారు, అంటే క్షమించే గుణానికి ప్రతీక. దీనిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వనంలో ఉసిరి చెట్టు కింద ధాత్రి కళ్యాణం (ఉసిరి కొమ్మను విష్ణువుగా, తులసి కొమ్మను లక్ష్మీదేవిగా భావించి చేసే కళ్యాణం) జరిపించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.
తాజావార్తలు
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!