Sriramanavami 2024 : ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణంను వెన్నెలలోనే ఎందుకు జరిపిస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీరామనవమి రోజున దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాలల్లో సీతారాముల కళ్యాణంను అంగరంగ వైభవంగా జరిపిస్తారు.. ప్రత్యేక భజనలు, రాముని ఊరేగింపులతో ఊరువాడా సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక్క ప్రాంతంలో మాత్రం రాముడి కళ్యాణంను నవమి తర్వాత తొమ్మిదో రోజూ జరిపిస్తారు.. అందుకు కారణాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. అసలు నిజానిజాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఒకప్పుడు ఆంధ్రా, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలంను ఎక్కువగా సందర్శించేవారు.. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో కొలువైన కోదండరాముని ఆలయాన్ని ఆంధ్రా భద్రాచలం అంటారు.. ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో మాత్రం చైత్ర పౌర్ణమి నాడు నిర్వహిస్తారు. దానివెనుక ఒక పురాణ కథ ఉంది.. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఏకశిలలో దర్శనమివ్వడం ఈ ఆలయ విశేషం. మహర్షులకు, తపోధనులకు, యజ్ఞ యాగాలకు ప్రసిధ్ది చెందింది..
Also Read
- Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
- ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
- Monday Horoscope: ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు.! నేటి రాశిఫలాలు ఇలా..
పురాణాల ప్రకారం యాగ రక్షణ కోసం రామ, లక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారనీ అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.. అలాగే ప్రతి శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమికి వెన్నెలలో సీతారాముల కళ్యాణం జరిపిస్తారు.. విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో..నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు.. అలా అక్కడ కళ్యాణంను వెన్నెలలో మాత్రమే జరిపిస్తారు.. గతంలో ఓ సారి ఆలయంలో నిర్వహించడం వల్ల ఇద్దరు మనుషులు ఆలయ ప్రాంగణంలో చనిపోయారు.. అందుకే ఇప్పుడు ఆలయం సమీపంలో కళ్యాణం నిర్వహిస్తారు.. రాష్ట్ర సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు.. ఆ తర్వాత పాన్పు సేవ రోజున వాటిని భక్తులకు సమర్పిస్తారు.. ప్రస్తుతం ఆ ఆలయ కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది..
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!