Site icon NTV Telugu

Flowers: మీ కోరికలు నెరవేరాలంటే ఈ పూలతో దేవుళ్లను పూజించాలి..

Pooja (2)

Pooja (2)

మనిషి జీవితం అంటే ఎప్పుడు ఏదొక సమస్య.. అందుకే దేవుడిని పూజిస్తారు.. దేవుడు కష్టాలను నెరవేరుస్తాడని నమ్ముతారు.. అందుకే దేవుళ్ళకు ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.. అయితే దేవుడిని పూజించేటప్పుడు పువ్వులను పెడతారు.. పూలు లేకుండా పూజలు చెయ్యరు.. పండితులు కూడా పువ్వు లేకుండా పూజ చేస్తే ఆ పూజ అసంతృప్తిగానే ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే హిందువులు ఎంతో మంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు.. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వు అంటే ఇష్టం ప్రీతికరం. అలా ఆ దేవుళ్లకు ఇష్టమైన పువ్వులతో పూజించడం ద్వారా కోరిన కోరికలను నెరవేరుస్తారు. మరి ఏ ఏ దేవుడిని ఎటువంటి పువ్వులతో పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

శివుడికి ఉమ్మేత్త పూలంటే చాలా ఇష్టం.. ఈ పూలతో పూజిస్తే ఆయన అనుగ్రహం మనమీద ఉంటుంది.. కోరికలు నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు.. కాళికా మాతకు ఎర్రమందారం అంటే చాలా ఇష్టం. ఆ పూలతో పూజిస్తే అమ్మవారు తప్పకుండా సంతోషిస్తారట. ఈ మందార పువ్వులను 108 తెచ్చి అమ్మవారిని పూజిస్టే ఎలాంటి కోరికైనా తీరుతుందట. అలాగే విష్ణుమూర్తికి పారిజాత పువ్వులు అంటే చాలా ఇష్టం. అయితే ఈ పారిజాత పువ్వులతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయి..

విగ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే ఆయనకు ఎంతో ఇష్టమైన బంతి పువ్వులతో పూజ చేయాలి. వీటిని కొన్ని ప్రదేశాలలో చండు పువ్వులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బంతిపూల దండ అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఇందులో ముఖ్యంగా ఆరెంజ్ కలర్ బంతిపూలు అంటే వినాయకుడు ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు.. ఇక లక్ష్మీ దేవికి తామర పూలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయి.. అలాగే సరస్వతి దేవికి పలాస పువ్వుతో పూజ చేయాల్సిందే. కృష్ణుడికి తులసిమాల,ఆంజనేయ స్వామికి ఎక్కువగా మల్లెపూలతో పూజ చెయ్యడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఇలా పూజించండి..

Exit mobile version