Hyundai Cars Price: హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. ఈనెల 31 వరకే అవకాశం!
- భారత్ లో హ్యుందాయ్ కార్లకు ఆదరణ
- డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు
- జనవరిలో ధరలు పెంచనున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ దేశంలోని అతిపెద్ద వాహనాల విక్రయ కంపెనీలలో ఒకటి. డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. కంపెనీ హ్యుందాయ్ వెన్యూలో గరిష్ట ప్రయోజనాలు అందజేస్తోంది. గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ20 కార్ల ధరలు కూడా తగ్గాయి. అయితే.. ఈ కార్ల ధరలను తిరిగి జనవరి 1, 2025 నుంచి పెంచుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు వర్తించే అవకాశం ఉంది!
READ MORE: Vijayasai Reddy Tweet on Pawan Kalyan: పవన్ కల్యాణ్పై విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్..
Also Read
- KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
- Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు
ఈ సంవత్సరం చివరి నెలలో హ్యుందాయ్ వాహనాలపై భారీ ఆఫర్ ప్రకటించింది. హ్యుందాయ్ వెన్యూలో రూ.75,629 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఆన్-రోడ్ ధర రూ.9.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్పై రూ.68 వేల వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.6.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
READ MORE:BJP MP K Laxma: తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా.. కేటీఆర్ పై లక్ష్మణ్ ఫైర్..
హ్యుందాయ్ ఐ20..
హ్యుందాయ్ ఐ20పై రూ.65 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఆన్-రోడ్ ధర రూ. 8.03 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ ఎక్సెటర్ రూ. 52,972 వరకు తగ్గింపు ఆఫర్ను కలిగి ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.13 లక్షల నుంచి మొదలై రూ. 10.43 లక్షల వరకు ఉంటుంది.
READ MORE:Pushpa -2 : రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ డ్రాప్.. కారణం ఇదే..?
వచ్చే ఏడాది పెరగనున్న ధరలు..
జనవరి 1, 2025 నుండి కార్ల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా డిసెంబర్ 5 గురువారం ప్రకటించింది. ఈ కొరియన్ ఆటో దిగ్గజం క్రెటా, వెన్యూ, ఎక్స్టర్, టక్సన్, అల్కాజర్ వంటి పాపులర్ ఎస్యూవీలతో పాటు వెర్నా ఐ 20, ఐ 10, తమ ఏకైక ఎలక్ట్రిక్ వాహనం అయోనిక్ 5తో సహా భారత్లో అందుబాటులో ఉన్న అన్ని మోడళ్ల ధరలను పెంచనుంది. ఇన్ పుట్ మెటీరియల్ ఖర్చు పెరగడం, లాజిస్టిక్స్ ఖర్చు, ప్రతికూల మారకం రేట్ల కారణంగా వచ్చే నెల నుంచి ధరల పెంపు అనివార్యమైందని హ్యుందాయ్ తెలిపింది.
తాజావార్తలు
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!