PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ హబ్ వైపు భారత్ అడుగులు.. మారుతి సుజుకి కొత్త తయారీ ప్లాంట్ ప్రారంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గుజరాత్లోని హన్సల్పూర్లో మారుతి సుజుకి కొత్త తయారీ ప్లాంట్ ను ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కైచీ ఓనో, సుజుకి మోటార్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ప్రారంభం అయ్యింది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా భారత్ గ్లోబల్ ఆటోమొబైల్ రంగంలో మరింత బలమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోనుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం కారణంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా చైనాకు పోటీగా నిలిచే దిశగా భావిస్తున్నారు.
Asia Cup 2025: ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్.. కానీ..!
Also Read
- Toyota Urban Cruiser EV: భారత మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV.. 543KM రేంజ్! ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు
- Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
- టెస్లా లవర్స్కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
ఈ కొత్త ప్లాంట్ లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాలు, అలాగే లిథియమ్-అయాన్ బ్యాటరీ సెల్స్, హైబ్రిడ్ వాహనాల కోసం ఎలక్ట్రోడ్స్ తయారు చేయనుంది. ఈ ప్రాజెక్ట్లో తోషిబా, డెన్సో, సుజుకి కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్లాంట్లో తయారయ్యే వాహనాలు, ముఖ్యంగా బ్రాండ్ తొలి ఎలక్ట్రిక్ కారు e-విటారా (BEV) సహా, 100కి పైగా దేశాలకు ఎగుమతి చేయబడతాయి.
వైర్లెస్ స్పీకర్లలో స్మార్ట్ ఆడియో సెటప్.. కొత్త TCL Z100 లాంచ్!
ఈ హన్సల్పూర్ ప్లాంట్ ప్రతి ఏడాది మూడు ప్రొడక్షన్ లైన్ల ద్వారా ఏకంగా 7.5 లక్షల వాహనాలు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది తాజాగా సుజుకి మోటార్ కార్పొరేషన్ నుండి మారుతి సుజుకి చేతికి వచ్చింది. ప్రస్తుతం కంపెనీకి గురుగ్రామ్, మనేసర్ (హరియాణా), హన్సల్పూర్ (గుజరాత్) సహా మూడు ప్లాంట్లలో కలిపి 2.35 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. భవిష్యత్ లక్ష్యంగా మారుతి సుజుకి ఈ దశాబ్దం చివరినాటికి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 మిలియన్ యూనిట్లకు పెంచాలని ప్రకటించింది. ఇందుకోసం హరియాణాలోని ఖార్కొదా గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించిందని.. దీని ప్రాథమిక సామర్థ్యం 2.5 లక్షల యూనిట్లుగా పేర్కొంది. అంతేకాకుండా గుజరాత్లో మరొక గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉంది కంపెనీ.
#WATCH | Ahmedabad, Gujarat: Prime Minister Narendra Modi says, "India has the power of Democracy. India has the advantage of Demography. We also have a very large pool of Skilled Workforce. Therefore, this creates a Win-Win Situation for every Partner of ours. Today, Suzuki… pic.twitter.com/spTiIuh3Wj
— ANI (@ANI) August 26, 2025
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi and Toshihiro Suzuki, President & Representative Director of Suzuki Motor Corporation, flagged off the 'e-VITARA', Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad.… pic.twitter.com/LPKWBjdykN
— ANI (@ANI) August 26, 2025
తాజావార్తలు
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..