ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు సైతం లేటెస్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇటీవల హర్యానాకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ జెలియో ఎలక్ట్రిక్ మొబిలిటీ దేశీయ మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లిటిల్ గ్రేసీని అధికారికంగా విడుదల చేసింది. స్పెషల్ లుక్, డిజైన్తో అట్రాక్ట్ చేస్తోంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర కేవలం రూ. 49,500 (ఎక్స్-షోరూమ్) […]
తమిళనాడులో త్రిభాషా వివాదం రగులుకుంటోంది. రాష్ట్ర బడ్జెట్ లోగో నుంచి రూపాయి చిహ్నాన్ని స్టాలిన్ ప్రభుత్వం తొలగించింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా పాలసీ కొత్తది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటీ నుంచి ఈ విధానం కొనసాగుతుందని అన్నారు. నచ్చిన భాషలో చదువుకోవచ్చు. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని చెప్పారు. Also Read:Tirupati Stampede: […]
ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. నిరుద్యోగులకు ఇదే మంచి సమయం. కొన్ని రకాల ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష రాయకుండానే సొంతం చేసుకోవచ్చు. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఇలాంటి అవకాశమే వచ్చింది. నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1765 పోస్టులను భర్తీ చేయనున్నారు. […]
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అని.. గాంధీ భవన్ లో మాట్లాడినట్టు ఉంది అని బీఆర్ఎస్ వాళ్ళు గవర్నర్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై రేవంత్ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో అన్న వాళ్ళు ఇలా మాట్లాడుతారా.. అజ్ఞానమే.. తన విజ్ఞానం అనుకుంటున్నారు అని […]
మాంసాహారాల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుండడంతో చాలా మంది చికెన్, మటన్ లను లాగించేస్తుంటారు. కొంతమందికి ముక్కనేనిదే ముద్ద దిగదు. అయితే నాన్ వెజ్ తినడం వల్ల కొందరికి ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే చాలా మంది నాన్-వెజ్ జీర్ణించుకోలేరు. దీంతో అలర్జీకి గురవుతుంటారు. వైద్యులు కూడా అలాంటి వారికి నాన్-వెజ్ తినకూడదని సూచిస్తుంటారు. ముఖ్యంగా ఆ వ్యాధులతో బాధపడుతున్నవారు నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. Also Read:YS Sunitha Reddy: వివేకా […]
తులం బంగారం ధర రూ. 90 వేలను తాకడంతో పసిడి కొనుగోలుదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆకాశమే హద్దుగా గోల్డ్ ధరలు పైకి ఎగబాకుతున్నాయి. బంగారం బాటలోనే సిల్వర్ కూడా పయనిస్తోంది. ఇక నిన్నటి వరకు పరుగులు పెట్టిన పుత్తడి ధరలు నేడు పడిపోయాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన గోల్డ్ ధరలతో గోల్డ్ లవర్స్ ఊరట చెందుతున్నారు. నేడు తులం బంగారంపై రూ.110 తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో […]
దేశాలపై సుంకాలతో ట్రేడ్ వార్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ లిస్ట్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, ఇతర దేశాలు ఉన్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్ సర్కార్ మొత్తం 41 దేశాలతో మూడు జాబితాలను సిద్ధం చేసిందని తెలిపింది. మొదటి జాబితాలో 10 దేశాలు చేర్చబడ్డాయని, […]
గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూ మైనారిటీలను ముస్లిం మెజారిటీ జనాభా లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ దేశంలో శాంతి భద్రతలు గాడిలో ఉన్నాయని చెబుతున్నప్పటికీ, అక్కడ హిందువులపై దాడులు ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగింది. లక్ష్మీపూర్ జిల్లాలోని రాయ్పూర్లోని మురిహట ప్రాంతంలోని శ్రీ శ్రీ మహామాయ ఆలయంలో ముసుగులు […]
కెనడా 24వ ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ శుక్రవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒట్టావాలోని రిడ్యూ హాల్లో గవర్నర్ జనరల్ మేరీ సైమన్ కార్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మార్క్ కార్నీ మాజీ సెంట్రల్ బ్యాంకర్. అతడు బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండింటికీ నాయకత్వం వహించాడు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో కెనడా అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన […]
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు రెండో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇరు దేశాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందల భవనాలు నెలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విజ్ఞప్తి చేశాడు. వేలాది మంది ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలను కాపాడాలని ట్రంప్ పుతిన్కు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ దళాలు పూర్తిగా చుట్టుముట్టబడ్డాయని ట్రంప్ తెలిపాడు. యుద్ధంతో ఉక్రెయిన్ చితికి పోయిందని కనికరం చూపాలని ట్రంప్ […]