అల్లూరి జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు. ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ వర్షా బాలకృష్ణ (40) దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు బాలకృష్ణ తలపై బండరాయితో మోదటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో కొందరు వ్యక్తులతో జరిగిన గొడవలో వారు బండరాయితో కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కన్నాయిగూడెం గ్రామశివార్లలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి […]
ఎన్నికల్లో మద్య ప్రభావం తగ్గించేలా అనేక చర్యలు చేపట్టామన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిస్టలరీలు, బ్రూవరీస్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిఘా పెట్టామని, మద్యం రవాణ జరిపే వాహానాలకు జీపీఎస్ ట్రాకింగ్ పెట్టామన్నారు ఎంకే మీనా. సేల్ పాయింట్ల వద్ద గతంలో జరిగిన అమ్మకాలకు.. ఇప్పుడు జరుగుతున్న అమ్మకాలను బేరీజు వేస్తున్నామని, 7 లక్షల మంది హోం ఓటింగుకు అర్హులైన వాళ్లున్నారన్నారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద […]
ఏపీలో ఎన్నికల్లో జోరు పేరిగింది. నిన్న ఎన్నికల నోటిషికేషన్ విడుదల కావడంలో పశ్చిమగోదావరి జిల్లాలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు మంత్రులు. గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత నామినేషన్కు సిద్ధం కాగా… తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు నామినేషన్ వేయనున్నారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అని, దెందులూరులో ఎమ్మెల్యే అబ్బాయచౌదరి నామినేషన్లు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి.. చీపురుపల్లి మూడు […]
టర్కీలో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.6గా నమోదు మిడిల్ ఈస్ట్ దేశం టర్కియేలో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కియేలో గురువారం ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ ప్రకారం.. రాజధాని అంకారాకు తూర్పున 450 […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై శనివారం అజిత్సింగ్ నగర్ సమీపంలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి ఐదుగురు అనుమానితులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే.. సీఎం జగన్పై దాడి కేసులో A1గా ఉన్న సతీష్కు విజయవాడ సెషన్స్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో A1 సతీష్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీఎం జగన్ను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు. అదును చూసి సున్నితమైన తల […]
నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం అచ్చంపేట జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఆ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా […]
గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో ఈరోజు M కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా గన్నవరం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు , ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ పరిశీలకులు మరియు ఇన్చార్జ్ ఆకుల వెంకట నాంచారయ్య, […]
నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర. సాయంత్రం అచ్చంపేట జంక్షన్లో బహిరంగ సభ. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,790 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.89,900 లుగా ఉంది. నేటి నుంచి 24 వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. […]
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎలాంటి అవాంతరాలు లేకుండా గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ రిటర్నింగ్ అధికారులను మరియు ఎన్నికల విధుల్లో నియమించబడిన ఇతర అధికారులను కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేదా సమస్య లేకుండా బందోబస్తుతోపాటు అన్ని ఇతర ఏర్పాట్లు చేయడానికి మరియు నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయడానికి వారు అనుసరించాల్సిన మరియు చేయకూడని పనులపై బుధవారం ROS, AROలు మరియు జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి […]
బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యదర్శి సందినేని జనార్దన్రావు మృతి చెందడంతో నల్లగొండ పట్టణంలో విషాద వార్త అలుముకుంది. టీవీ మీడియా నివేదికలు మరియు వైరల్ వీడియో ప్రకారం, నల్గొండ బైపాస్ రోడ్డులో నటుడు రఘుబాబుకు చెందిన కారు బైక్ను ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది, ఫలితంగా బైక్దారుడు అకాల మరణం చెందాడు. ఢీకొన్న తర్వాత బైక్ను కారు దాదాపు యాభై మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ తరుణంలో కారు డ్రైవర్, రఘుబాబు […]