మంత్రిగా నారా లోకేష్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకూ నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మంత్రి వర్గ సమావేశం కూడా ఉండటంతో ఆయన పదవీ బాధ్యలను సచివాలయంలో చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ బాధ్యతలను చేపట్టక పోవడానికి ఆయన ఛాంబర్ లో స్వల్ప మార్పులు చేర్పులు చేయడం వల్లే అని చెబుతున్నారు. స్వల్ప మార్పులు చేయాల్సి రావడంతో… ఈ రోజు ఉదయం 9.45 గంటలకు నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. […]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన ప్రతిరోజూ వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జన దర్బార్ ద్వారా పవన్ కళ్యాణ్ తన సహాయాన్ని కోరేందుకు వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం విజయవాడలోని పవన్ క్యాంపు కార్యాలయంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు పవన్ కల్యాణ్ని కలవనున్నారు. […]
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తం చెప్పింది. శ్రీవారిని దర్శించుకునేందుకు నేడు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఉదయం 10 గంటలకు టీటీడీ ఈ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. అలాగే.. తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను కూడా […]
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. నేడు ఆన్లైన్లో సెప్టెంబర్ నెల టిక్కెట్లు విడుదల, మధ్యాహ్నం వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ. నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్కు వివరించనున్న నిర్మాతలు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కల్యాణ్తో చర్చించనున్న నిర్మాతలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీల […]
బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ.. వేలంలో పాల్గొనాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుబట్టారు. సోమవారం వేలం వేయనున్న 90 బొగ్గు గనుల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు చెందిన శ్రావణపల్లి బొగ్గు బ్లాకు ఒకటి. ఈ వేలానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరవుతారని ఆదివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఈశ్వర్ తెలిపారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ […]
రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోమవారం న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే బడ్జెట్ సమావేశానికి ముందు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు ఆయన న్యూఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. తన పర్యటనలో ఆయన ఏఐసీసీ నేతలతో సమావేశమై మంత్రివర్గ విస్తరణ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కోరగా, వారి ఆమోదం మేరకు […]
వికారాబాద్ జిల్లా తాండూరులో చోరీకి గురైన ఫోను ఆ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా భావించారు. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కడసారి చూపు చూ చూసేoదుకని బంధువులు మిత్రులు అందరూ వచ్చేశారు. అంత్యక్రియలకు తరలించేందుకు పాడి ఎక్కించే సమయంలో అసలు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులు బంధువులు అంతా అవాక్కైపోయారు. వివరాలలోకి వెళితే…. బషీరాబాద్ మండలం […]
చెట్టును ఢీకొన్న ఆర్డీసీ బస్సు.. 25 మందికి గాయాలు మహారాష్ట్రలోని పుణెలో రోడ్డుప్రమాదం జరిగింది. యావత్ గ్రామంలోని సహజ్పూర్ ఫాటా సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆదివారం పూణె జిల్లాలో చెట్టును ఢీకొనడంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పంఢర్పూర్ […]
మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించిన నేపథ్యంలో దీప్తిశ్రీనగర్లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నంబర్.100, 101లో ఉన్న స్థలంలో ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో పోలీసులపై ఆక్రమదారులకు రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. డీసీపీ వినీత్ మాట్లాడుతూ.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100,101 సర్వే […]
రాష్ట్రంలో నిషేధిత గుట్కా ను బ్యాన్ చేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో పక్క సమాచారంతో ఆదిలాబాద్ పట్టణంలోని 5 గోడౌన్స్ లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, అర్ధరాత్రి స్థానిక ఓంకార్ జిన్నింగ్ మిల్ నందు నాలుగు గోడౌన్స్ లలో , చాందా వద్దగల ఒక గోడౌన్ నందు రూ 77,60,586 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా లభించిందని తెలిపారు. అర్ధరాత్రి జిల్లా ఎస్పీ, డిఎస్పి, సిసిఎస్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ […]