ఏపీలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. వైసీపీ-టీడీపీ నేతల మాటల మంటలు కొనసాగుతూనే వున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళేది టీడీపీని బీజేపీలోకి కలపడానికే అన్నారు. పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వుంటే బాగుండేదని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. పట్టాభిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు దీక్ష చేసి ఉంటే బాగుండేదన్నారు.
చంద్రబాబు దీక్ష వేదిక నుండి ఏం మాట్లాడారో అందరం చూశామని, దీక్ష ముగిసే లోపు చంద్రబాబు.. అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆయన పెద్దరికం నిలబడుతుందన్నారు. భవిష్యత్తులో టీడీపీని.. బీజేపీలో కలపటానికే చంద్రబాబు అమిత్ షాను కలవబోతున్నారు. ఏపీలోకి సీబీఐని రానివ్వనని చెప్పింది చంద్రబాబే అన్నారు డొక్కా. గవర్నర్ పాలన విధించాలని ప్రాంతీయ పార్టీ డిమాండ్ చేయడం సహేతుకం కాదన్నారు.