NTV Telugu Site icon

Minister Lokesh: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు..

Lokesh

Lokesh

Minister Lokesh: పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ మంత్రి నారా లోకేష్ ను విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై మంత్రి సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణ జరిపి, గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాలయాల ప్రాంగణంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఇప్పటికే తమ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని నారా లోకేష్ వెల్లడించారు.

Read Also: UP : సామూహిక అత్యాచారం.. న్యాయం కోసం ట్యాంక్ ఎక్కి అక్కడే నిద్రపోయిన బాధితురాలు

ఇక, ఏపీ- తెలంగాణ రాష్ట్రాల నుంచి తమ పిల్లల్ని పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ చేర్పించి తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజా దర్బార్ లో మంత్రి లోకేష్ ని కలిసి తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులు వాపోయారు. క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. క్యాంపస్సులో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు మార్కులు పరంగా ఫెయిల్ అవుతున్నారని పేర్కొన్నారు. పదో తరగతిలో 90 శాతం పైగా మార్కులు సాధించిన తమ పిల్లలకు ఇంటర్ లో సిబ్బంది.. ఇంటర్నల్ మార్క్స్ విషయంలో నిర్లక్ష్యం వహించి ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. లోపభూయిష్టంగా తయారైన పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీపై దృష్టి సారించి తమ విద్యార్థుల భవిష్యత్త్ కాపాడాలని ఏపీ – తెలంగాణ రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. సమస్యను తప్పక పరీష్కరించి విద్యార్థుల భవిష్యత్త్ కాపాడతానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.