Minister Nimmala: ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా చేసింది.. చేయబోయేది తెలుగుదేశమే
- మహానాడులో నీటిపారుదల రంగ తీర్మానం ప్రతిపాదించిన మంత్రి నిమ్మల..
- ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా చేసేది, చేయబోయేది తెలుగుదేశమే..
- రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడానికి ఎన్టీఆర్, చంద్రబాబు ఎంతో కృషి చేశారు: మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala: రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడానికి నాడు ఎన్టీఆర్ నుంచి నేటి మన అధినేత చంద్రబాబు వరకు ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహానాడులో నీటి వనరులకు సంబంధించి ప్రతిపాదించిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచభూతాలలో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారని అన్నారు. జల వనరులు ఉన్నచోటే నాగరికతలు వెల్లి విరుస్తాయనే చారిత్రక సత్యాన్ని మన పార్టీ ఆవిర్భావ దశలోనే గుర్తించింది.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొ్న్నారు.
Read Also: UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!
Also Read
అయితే, 2014 -19లో నాటి మన ప్రభుత్వం 72 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయగా.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ ఆ ప్రాజెక్టుని విధ్వంసం చేసిందన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరిలో ఏటా వృథాగా పోతున్న నీటిని.. రాయలసీమకు తరలించి రతనాల సీమ చేయాలనేది మా టార్గెట్ అన్నారు. ఇందుకు 80 వేల కోట్లు అంచనా వ్యయంతో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 72 లక్షల మందికి తాగునీరు, 7.2 లక్షలు ఎకరాలకు సాగునీరు, 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. అప్పుడు, రాయలసీమ పచ్చని పైర్లతో అలా రారుతుందన్నారు. అలాగే, పోలవరం ఎడమ కాలువ పూర్తి చేయడం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుంది.. విశాఖ నగరానికి తాగునీరు, విశాఖ ఉక్కు తదితర అనేక పారిశ్రామిక అవసరాలకు పూర్తిస్థాయి నీటిని అందించగలుగుతామని నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!