Minister Nimmala: ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా చేసింది.. చేయబోయేది తెలుగుదేశమే
- మహానాడులో నీటిపారుదల రంగ తీర్మానం ప్రతిపాదించిన మంత్రి నిమ్మల..
- ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా చేసేది, చేయబోయేది తెలుగుదేశమే..
- రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడానికి ఎన్టీఆర్, చంద్రబాబు ఎంతో కృషి చేశారు: మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala: రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడానికి నాడు ఎన్టీఆర్ నుంచి నేటి మన అధినేత చంద్రబాబు వరకు ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహానాడులో నీటి వనరులకు సంబంధించి ప్రతిపాదించిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచభూతాలలో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారని అన్నారు. జల వనరులు ఉన్నచోటే నాగరికతలు వెల్లి విరుస్తాయనే చారిత్రక సత్యాన్ని మన పార్టీ ఆవిర్భావ దశలోనే గుర్తించింది.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొ్న్నారు.
Read Also: UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!
Also Read
అయితే, 2014 -19లో నాటి మన ప్రభుత్వం 72 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయగా.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ ఆ ప్రాజెక్టుని విధ్వంసం చేసిందన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరిలో ఏటా వృథాగా పోతున్న నీటిని.. రాయలసీమకు తరలించి రతనాల సీమ చేయాలనేది మా టార్గెట్ అన్నారు. ఇందుకు 80 వేల కోట్లు అంచనా వ్యయంతో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 72 లక్షల మందికి తాగునీరు, 7.2 లక్షలు ఎకరాలకు సాగునీరు, 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. అప్పుడు, రాయలసీమ పచ్చని పైర్లతో అలా రారుతుందన్నారు. అలాగే, పోలవరం ఎడమ కాలువ పూర్తి చేయడం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుంది.. విశాఖ నగరానికి తాగునీరు, విశాఖ ఉక్కు తదితర అనేక పారిశ్రామిక అవసరాలకు పూర్తిస్థాయి నీటిని అందించగలుగుతామని నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
-
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!