Kadapa: టీడీపీ అధికారంలో రావడం సంతోషకరం.. ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం సాధించింది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా.. టీడీపీ నేతలు విజయానందంలో మునిగితేలుతున్నారు. కాగా.. విజయంపై కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజార్టీని ప్రజలు ఇచ్చారని తెలిపారు. 2019లో వైసీపీ ఇచ్చిన మోసాలు నమ్మి మోసపోయామని ప్రజలు భావించారని.. వాళ్ళ నాయకుడే ఓటమిని ఒప్పుకున్నారన్నారు. మరోవైపు.. ఈవీఎంలను ట్యాపరింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. అభివృద్ధిలో కలిసి పని చేస్తామంటే తాము కూడా కలిసి పనిచేయడానికి సిద్ధమని పేర్కొ్న్నారు. అవినీతిని బయటకు తీస్తామని తెలిపారు.
Read Also: CM Revanth Reddy: ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే.. !
Also Read
మరోవైపు.. రాజంపేటలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో రావడం సంతోషకరమని అన్నారు. టీడీపీ గెలుపులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని.. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు బర్తరఫ్ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇటువంటి ఫలితాలు వచ్చాయన్నారు. తిరిగి అంతకన్నా దారుణ ఫలితాలను వైసీపీకి 11 సీట్లను ప్రజలు ఇచ్చారని తెలిపారు. దేశంలోనే టీడీపీ విజయం చారిత్రాత్మకమైందని.. రాజంపేటలో టీడీపీ అభ్యర్థి చిన్న చిన్న తప్పులతో ఓటమి చెందారని అన్నారు. భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతామని జగన్ మోహన్ రాజు తెలిపారు.
Read Also: Jr NTR: ప్రియమైన బాబు మావయ్య, బాలకృష్ణ బాబాయ్.. సంచలనం రేపుతున్న ఎన్టీఆర్ ట్వీట్
- Tags
- janasena
- NDA
- Power
- tdp
- telugu news
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!