Vizianagaram Incident: విజయనగరం నగరంలోని ఏపీఎస్బీ 5వ బెటాలియన్ ఎదుట ఉన్న కృష్ణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి తన భార్య, మేనకోడలు, తల్లి తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎదురింట్లో పృథ్వి అనే యువకుడు నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి పక్కన ఉన్న నారింజ చెట్టు నుంచి కాయలు కోస్తున్న సమయంలో కళ్యాణ్ తల్లి, పృథ్వి మధ్య వాగ్వాదం జరిగింది. కాయలు ఎవ్వరిని అడిగి కోస్తున్నారని ప్రశ్నించడంతో ఇద్దరి కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
Read Also: Trump: ట్రంప్ చైనా టూర్పై సందిగ్ధం.. కారణమిదేనా?
ఈ గొడవల నేపథ్యంలో కళ్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న పృథ్వి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నిండు గర్భిణీ అయిన కళ్యాణ్ భార్య ఇంటి ముందు కూర్చుంటే ఆమెకు ఎదురుగా నిలబడి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నాడని చెబుతున్నారు. అంతేకాదు రాత్రి సమయంలో మద్యం తాగి వచ్చి, సీసీ కెమెరా ముందు కూడా అసభ్య ప్రవర్తనకు దిగుతున్నాడని బాధితులు తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదుకావడంతో కళ్యాణ్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
