అంతర్రాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ మన్యం ధారకొండ ఘాట్ రోడ్డులో దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ముఠాను అరెస్ట్ వారి వద్ద నుంచి కారు , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . దీనికి సంబందించి గూడెం కొత్తవీధి సీఐ అశోకుమార్ వివరాలు అందచేశారు.
విశాఖ గ్రామీణ జిల్లా ఎస్పీ బి . కృష్ణారావు ఆదేశాలు మేరకు చింతపల్లి ఎఎస్పీ తుషారూదీ , సీసీఎస్ డీఎస్పీ డీఎస్ఆర్ఎఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జీకేవీధి సీఐ అశోకకుమార్ , సీలేరు ఎస్సై రంజిత్ , సీసీఎస్ ఎస్సై హిమగిరిలు సారధ్యంలో నాలుగు బృందాలు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతీయులను భయాందోళనకు గురిచేస్తున్న గూడెం కొత్తవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో జరుగుతున్న దారిదోపిడీలను అరికట్టడానికి గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
సోమవారం తెల్లవారుజామున ఘాట్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా గత నెల 23 న సప్పర్ల రెయినేజ్ వద్ద కారును అపహరించిన ఘటనలో కీలకనిందితులుగా ఉన్నట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కలిమెల బ్లాక్ ఎంవీ 79 పోలీసుస్టేషన్ పరిధిలోని ఎంపీపీ -65 గ్రామానికి చెందిన నీలకంఠ బిశ్వాస్ ( 21 ) , హరేన్ బిశ్వాస్ ( 26 ) , ఎంపీవీ -41 గ్రామానికి చెందిన సుశాంతాయ్ ( 22 ) , ఎంపీనీ -73 గ్రామానికి చెందిన మహేష్ సర్కార్ ( 21 ) లు ఉన్నారు. ముగ్గురు పరారీలో ఉన్నారని సీఐ అశోక కుమార్ తెలిపారు. దొంగల నుంచి ఎరుపు రంగు హుండా వెన్యూ కారు. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..