Vizag Crime: మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ప్రియుడి కోసం.. సుపారీ ఇచ్చి భర్త హత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవడానికి సుపారీ ఇచ్చి మర్డర్ చేయించింది భార్య. ప్రియుడుతో జీవితం పంచుకోవడానికి జీవిత భాగస్వామిని మట్టుబెట్టించింది.. పక్కా స్కెచ్ వేసి రూ. 50 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.. సుపారీ తీసుకుని హత్య చేసిన నిందితులను.. మృతదేహం లభ్యం అయిన ఘటనా స్థలానికి తీసుకెళ్లి.. సీన్ రీ క్రియేట్ చేశారు పోలీసులు.. ఓ చోట హత్య చేసి.. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహాన్ని పడేసి వెళ్లారు.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది..
Read Also: Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 10 రోజుల పాటు హైక్.. ఏపీ జీవోలో ఏముందంటే?
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
మొత్తంగా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది.. 40 రోజుల తర్వాత మిస్సింగ్ కేసు మర్డర్ కేసుగా తేలింది.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అన్న కారణంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి లేపేసింది భార్య.. మృతుడు నాగరాజుకు రమ్యతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.. అయితే, వసంతరావు తో పరిచయం పెంచుకున్న భార్య రమ్య వివాహేతర సంబంధం కొనసాగించింది.. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు మర్డర్ ప్లాన్ వేసింది.. ప్రియుడు అతని స్నేహితులతో హత్య చేయించి తిమ్మాపురంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు.. తర్వాత భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య.. అయితే, భార్య తీరుపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టి కేసు ఛేదించారు… నాగరాజును హత్య చేయించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరు అవుతున్నారు.. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారని వాపోతున్నారు..
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
-
Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
-
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
-
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!