South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్థరాత్రి తర్వాత విడుదల చేసిన గెజిట్ ద్వారా South Coast Railway Zone ఏర్పాటు అధికారికంగా ప్రకటించింది. రైల్వే చట్టం ప్రకారం ఈ కొత్త జోన్ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ జోన్కు ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. ఈ కొత్త రైల్వే జోన్ను ఇప్పటికే ఉన్న East Coast Railway మరియు South Central Railway జోన్ల నుంచి విభజించి ఏర్పాటు చేస్తున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. అలాగే ప్రస్తుత వాల్టేర్ డివిజన్ను విభజించి, విశాఖపట్నం డివిజన్గా మార్చే ప్రక్రియను కూడా ప్రారంభించారు.
వాల్టేర్ డివిజన్ను రెండు భాగాలుగా విభజించడం ఈ నిర్ణయంలో ముఖ్యాంశం. ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్త రాయగడ డివిజన్గా ఏర్పాటు చేస్తుండగా, మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖ డివిజన్గా మార్చనున్నారు. ఈ మార్పులు కూడా జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చర్యల వల్ల రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి, ప్రాంతాల వారీగా పర్యవేక్షణ మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాయగడలో ఏర్పాటు చేసే కొత్త డివిజన్లో కోరాపుట్–సింగపూర్ రోడ్, కొత్తవలస–కిరండూల్, కునేరు–థెరువలి, గుణుపూర్–పర్లకిమిడి వంటి మార్గాలు చేరనున్నాయి. ఈ డివిజన్ మొత్తం 696 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదనంగా పలాసా–ఇచ్ఛాపురం మార్గాన్ని ఖుర్దా రోడ్ డివిజన్ నుంచి విశాఖ డివిజన్కు బదిలీ చేశారు.
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ఇక, ఆపరేషనల్ అవసరాల దృష్ట్యా గుంటకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్ల మధ్య కూడా మార్పులు చేపట్టారు. రాయచూర్–వాడి, విష్ణుపురం–పగిడిపల్లి మార్గాలు సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ అయ్యాయి. కొండపల్లి–మోతుమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్లో చేర్చారు. కొత్త సరిహద్దులను కూడా స్పష్టంగా నిర్ణయించారు. మొత్తంగా ఈ మార్పులతో రైల్వే మార్గాల నిర్వహణ సులభతరం అవుతుందని, సేవల సమన్వయం మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి మరింత వేగం వస్తుందని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమాకు టైం వచ్చేసింది!
-
One Vote Victory: ఒక్క ఓటుతో గెలుపు.. తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి సంచలన విజయం!
-
KiaraAdvani : ‘టాక్సిక్’లో రొమాంటిక్ సీన్స్ పై కియారా కామెంట్స్..
-
Astrology: మే 5th మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!