South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్థరాత్రి తర్వాత విడుదల చేసిన గెజిట్ ద్వారా South Coast Railway Zone ఏర్పాటు అధికారికంగా ప్రకటించింది. రైల్వే చట్టం ప్రకారం ఈ కొత్త జోన్ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ జోన్కు ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. ఈ కొత్త రైల్వే జోన్ను ఇప్పటికే ఉన్న East Coast Railway మరియు South Central Railway జోన్ల నుంచి విభజించి ఏర్పాటు చేస్తున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. అలాగే ప్రస్తుత వాల్టేర్ డివిజన్ను విభజించి, విశాఖపట్నం డివిజన్గా మార్చే ప్రక్రియను కూడా ప్రారంభించారు.
వాల్టేర్ డివిజన్ను రెండు భాగాలుగా విభజించడం ఈ నిర్ణయంలో ముఖ్యాంశం. ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్త రాయగడ డివిజన్గా ఏర్పాటు చేస్తుండగా, మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖ డివిజన్గా మార్చనున్నారు. ఈ మార్పులు కూడా జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చర్యల వల్ల రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి, ప్రాంతాల వారీగా పర్యవేక్షణ మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాయగడలో ఏర్పాటు చేసే కొత్త డివిజన్లో కోరాపుట్–సింగపూర్ రోడ్, కొత్తవలస–కిరండూల్, కునేరు–థెరువలి, గుణుపూర్–పర్లకిమిడి వంటి మార్గాలు చేరనున్నాయి. ఈ డివిజన్ మొత్తం 696 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదనంగా పలాసా–ఇచ్ఛాపురం మార్గాన్ని ఖుర్దా రోడ్ డివిజన్ నుంచి విశాఖ డివిజన్కు బదిలీ చేశారు.
Also Read
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
ఇక, ఆపరేషనల్ అవసరాల దృష్ట్యా గుంటకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్ల మధ్య కూడా మార్పులు చేపట్టారు. రాయచూర్–వాడి, విష్ణుపురం–పగిడిపల్లి మార్గాలు సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ అయ్యాయి. కొండపల్లి–మోతుమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్లో చేర్చారు. కొత్త సరిహద్దులను కూడా స్పష్టంగా నిర్ణయించారు. మొత్తంగా ఈ మార్పులతో రైల్వే మార్గాల నిర్వహణ సులభతరం అవుతుందని, సేవల సమన్వయం మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి మరింత వేగం వస్తుందని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!