Site icon NTV Telugu

Fishermen: బంగ్లాదేశ్‌ జైలు నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు..

Fishermen Released From Ban

Fishermen Released From Ban

Fishermen: బంగ్లాదేశ్‌ జైలులో 3 నెలల పాటు మగ్గిన మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు.. మూడు నెలల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విజయనగరం జిల్లా మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ జైలులో నిర్బంధంలో ఉన్న 9 మంది మత్స్యకారులు విడుదలై, మూడు రోజుల క్రితం విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. భారత ప్రభుత్వ చొరవతో పాటు దౌత్య పరమైన ప్రయత్నాల ఫలితంగా, మత్స్యకారులు మూడు నెలల్లోనే బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. స్వదేశానికి చేరుకున్న మత్స్యకారులను చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

Read Also: Shambala : ఓటీటీలో ‘శంబాల’ ప్రభంజనం.. కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ల మార్క్!

ఇక, విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారుల అసోసియేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కొడుకులు, భర్తలు క్షేమంగా తిరిగిరావడంతో కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు భారత ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దు సముద్ర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని మత్స్యకార సంఘ నాయకులు కోరారు. ఈ సంఘటనతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

Exit mobile version