Bail to Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్‌ మంజూరు.. ట్విస్ట్‌ ఏంటంటే..!

  • మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు భారీ ఊరట..
  • సత్యవర్ధన్‌ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్..
  • బెయిల్ ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం..
Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Bail to Vallabhaneni Vamsi: విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు భారీ ఊరట దక్కింది.. సత్యవర్ధన్‌ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికే రెండు సార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు వంశీ.. రెండు సార్లు కూడా బెయిల్‌ తిరస్కరించింది కోర్టు.. దీంతో.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఆ పిటిషన్‌పై ఇటీవల ఇరు వర్గాల తరపు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు.. ఈ రోజు వల్లభనేని వంశీ మోహన్‌కు బెయిల్ మంజూరు చేసింది.. ఈ కేసులో వల్లభనేని వంశీ తో పాటు మరో నలుగురు నిందితులకు కూడా బెయిల్ ఇచ్చింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం..

Read Also: UP: ప్రియుడితో కలిసి భర్తను ముక్కలు నరికిన భార్య.. వాటిని ఏం చేసిందంటే?

అయితే, వల్లభనేని వంశీ మొదట సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయినా.. ఆ తర్వాత ఆయనపై వరుసగా మరిన్ని కేసులు నమోదు అయ్యాయి.. వంశీపై మొత్తం ఆరు కేసులు పెట్టారు.. ఆ ఆరు కేసుల్లో ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పొందారు వల్లభనేని వంశీ మోహన్‌.. కానీ, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా వంశీకి బెయిల్‌ రాలేదు.. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు వంశీ.. దీంతో, ఇప్పుడు సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో బెయిల్‌ వచ్చినా.. ఆయన జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉంది.. కాగా, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ మోహన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే..