MP Mithun Reddy: ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి.. సీట్ సీజ్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డి పాస్ పోర్ట్ రిలీజ్ చేయాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి తరుపున న్యాయవాదులు.. అయితే, న్యూయార్క్ లో జరగబోయే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు పీఎంవో నుంచి ఎంపికయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ నెల 27వ తేదీన నుంచి 31వ తేదీ వరకు న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. సిట్ సీజ్ చేసిన పాస్పోర్ట్ రిలీజ్ చేయాలంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి.. అయితే, పాస్ పోర్ట్ రిలీజ్ పై వాదనలు మధ్యాహ్నం 3 గంటలకి వాయిదా వేశారు విజయవాడలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి..
Read Also: Raashii Khanna : రాశీ ఖన్నా సోలో హీరోయిన్గా కనిపించడం కష్టమా…?
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏ-4గా ఉన్నారు ఎంపీ మిథున్రెడ్డి అయితే, సుమారు 71 రోజుల పాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి సెప్టెంబర్ 29న ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.. ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వారంలో రెండుసార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని పేర్కొంది.. మరోవైపు, మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ కోర్టుకు వెళ్లగా.. ఇప్పుడు పాస్ పోర్ట్ కోసం కోర్టుకు వెళ్లారు మిథున్ రెడ్డి..
