Site icon NTV Telugu

AP Liquor Scam Case: నేడు మరోసారి సిట్‌ విచారణకు సాయిరెడ్డి.. మాజీ ఎంపీ ఆసక్తికర ట్వీట్..

Vijay Sai Reddy

Vijay Sai Reddy

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఇంతకు ముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్‌కు ఇచ్చినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌కాగా.. ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. ఈ రోజు ఆయన ఏం చెబుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. తనకు తెలిసిన అన్ని విషయాలను సిట్ అధికారులకు చెబుతానని గతంలోనే ప్రకటించారు విజయసారెడ్డి.

Read Also: Renu Desai : రేణు దేశాయ్‌కు అనారోగ్యం – సర్జరీ అనంతరం వైరల్ పోస్ట్!

అయితే, సిట్ విచారణకు హాజరుకానున్న వేళ ఎక్స్ (ట్విట్టర్‌)లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.. భగవద్గీత శ్లోకాన్ని ఎక్స్ లో పోస్ట్‌ చేసిన ఆయన..
“विपक्ष सहित सभी राजनीतिक दलों को राज-धर्म का पालन करना चाहिए।
కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన!.. మా కర్మఫలహేతుర్భూ: మా తేసంగోஉస్త్వకర్మణి!!”

“కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు.. కానీ, వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు-శ్రీ శ్రీ భగవద్గీత.” అంటూ భగవద్గీత శ్లోకాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు సాయిరెడ్డి.. ఇవాళ రెండవసారి సాయిరెడ్డిని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది సట్‌.. ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన సాయిరెడ్డి.. తాజాగా ఇవాళ రెండవసారి విచారణకు హాజరుకానున్న సమయంలో ఎక్స్ లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

Exit mobile version