Site icon NTV Telugu

నేటి సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు….

నేటి సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు చేశారు. కోవిడ్ అంక్షలు, నైట్ కర్ఫ్యూతో ముందే ప్రకటించింది దేవస్థానం. భక్తులు గిరి ప్రదక్షిణ చేయకుండా గోశాల, పాత అడివివరం కూడళ్ల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. రేపు ఆషాఢ పౌర్ణమికి సింహ గిరిపై పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. పెద్ద సంఖ్యలో అప్పన్న స్వామి దర్శనానికి భక్తులు తరలిరానుండటంతో మూడు వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసారు. రేపు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు దర్శనాలు జరగనున్నాయి. నీలాద్రి గుమ్మం దగ్గర నుంచే భక్తులు, వీఐపీలకు దర్శనాలు ఉండనున్నాయి.

Exit mobile version