ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు భారీ తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27, 641 శాంపిల్స్ పరీక్షించగా.. 295 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 560 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,92,92,896 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,63,872 కు పెరిగింది.. ఇక, 20,44,692 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,350 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 4,830 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
ఏపీలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?
