Site icon NTV Telugu

ఏపీలో నేడు పెరిగిన కరోనా కేసులు…

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,030 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,869 మంది పాజిటివ్‌గా తేలింది… మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,316 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,87,051కు చేరుకోగా.. రికవరీ కేసులు 19,55,052కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13582 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,53,82,763 శాంపిల్స్‌ను పరీక్షించారు.

Exit mobile version