Site icon NTV Telugu

ఏపీ కరోనా అప్డేట్…

ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 32,036 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 186 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందరు. ఇదే సమయంలో 191 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,05,39,041 కు చేరింది.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,73,576 కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,56,979 కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,149 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,448 కు పెరిగింది.

Exit mobile version