Site icon NTV Telugu

ఏపీలో ఈరోజు 160 కరోనా కేసులు నమోదు…

ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఈరోజు స్థిరంగా ఉంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 30,859 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 160 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 201 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,77,396 కు చేరింది.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,74,868 కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,58,490 కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,912 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,466 కు పెరిగింది.

Exit mobile version