Site icon NTV Telugu

ఆంధ్రప్రదేశ్ కరోనా అప్డేట్…

corona

corona

ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,131 శాంపిల్స్‌ పరీక్షించగా.. 156 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 188 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,46,537 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,708 కు పెరిగింది.. ఇక, 20,58,289 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,465 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 1,954 గా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version