Site icon NTV Telugu

ఏపీలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?

ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,979 శాంపిల్స్‌ పరీక్షించగా.. 154 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 177 మంది కోవిడ్‌ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,05,70,020 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,730 కు పెరిగింది.. ఇక, 20,57,156 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,452 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 2,122 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Exit mobile version